North Korea: మా అణ్వాయుధాలు ద.కొరియాను తుడిచిపెట్టేస్తాయి..!
దక్షిణ కొరియా ముందస్తు దాడులు చేస్తే వారి సైన్యాన్ని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని ఉ.కొరియా హెచ్చరించింది.
కిమ్ సోదరి హెచ్చరికలు
ఇంటర్నెట్డెస్క్: దక్షిణ కొరియా ముందస్తు దాడులు చేస్తే వారి సైన్యాన్ని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని ఉ.కొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మూడు రోజుల్లో రెండోసారి హెచ్చరికలు జారీ చేశారు. అణుశక్తిపై ముందస్తు దాడుల గురించి ఆలోచించడం కూడా పెద్దతప్పే అని ఆమె ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ వద్ద పేర్కొన్నారు. ‘‘ఒక వేళ మాతో సైనిక ఘర్షణను దక్షిణ కొరియా ఎంచుకొంటే.. మా అణ్వాయుధ దళం కూడా రంగంలోకి దిగి వారి విధులను నిర్వహిస్తుంది. దేశంపై దాడులు చేయాలంటే భయపడేలా చేయడం ప్రాథమికంగా ఆ దళం విధి. కానీ, దాడి మొదలైతే మాత్రం శత్రుసైన్యాన్ని నాశనం చేస్తుంది. అదేమీ మా దళాలకు పెద్ద విషయం కాదు’’ అని కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా కీలక పాలసీ అడ్వైజర్గా ఆమె వ్యవహరిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కూడా యో జోంగ్ దక్షిణ కొరియా రక్షణ శాఖమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితమైనవని ఆమె అన్నారు. ఉపద్రవం జరగకుండా ఉండాలని దక్షిణ కొరియా భావిస్తే మాత్రం ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. ఈ నెల ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 110వ జయంతిని నిర్వహించుకోనుంది. ప్రస్తుత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్కు ఆయన తాత అవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.