China: మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు.. వైరల్గా వీడియోలు
చైనాలోని జియామెన్ నగరంలో సీఫుడ్లోనూ వైరస్ను పరీక్షించే పనిలో పడ్డారు అక్కడి అధికారులు. చేపలు, పీతలకు కూడా కొవిడ్ పరీక్షలు చేస్తు్న్నారు.........
బీజింగ్: కరోనా వ్యాప్తితో చైనీయులు ఇంకా వణికిపోతూనే ఉన్నారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతంలోని లక్షల మందిని క్వారంటైన్లో ఉంచి, ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా చైనాలోని జియామెన్ నగరంలో కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో అక్కడి 5మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఆ పరీక్షలను మనుషులకు మాత్రమే పరిమితం చేయలేదు. సీఫుడ్లోనూ వైరస్ను పరీక్షించే పనిలో పడ్డారు అధికారులు. చేపలు, పీతలకు కూడా కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
పీపీఈ కిట్టు ధరించిన వైద్య సిబ్బంది చేపలు, పీతలకు పీసీఆర్ విధానంలో కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విటర్లో పంచుకుంది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు అక్కడి సోషల్ మీడియాల్లో వైరల్గా మారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ చర్యను కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. వాటిల్లో కరోనా ఉందో, లేదో తెలుసుకునేందుకు టెస్టులు కాకుండా మరే ఇతర మార్గం లేదు అని ఓ వర్గం పేర్కొంటోంది. అయితే, అతి జాగ్రత్తతో ఈ తరహా పరీక్షలు చేస్తూ ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మరో వర్గం వారిస్తోంది. ఇదో పిచ్చిపని అని.. అధ్యక్షుడు, అధికార యంత్రాంగానికి పిచ్చిపట్టినట్లుందని కొందరు ఈ చర్యను కొట్టిపడేస్తున్నారు.
కాగా సీఫుడ్కు కరోనా పరీక్షలను జియామెన్ నగర అధికారులు సమర్థిస్తున్నారు. ఇలా తాము మాత్రమే చేయడం లేదని.. వైరస్ వ్యాప్తితో వణికిపోయిన హైనన్ నగరం నుంచి పాఠాలు నేర్చుకున్నామని పేర్కొంటున్నారు. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులతో కలిసే అవకాశం ఉందని.. వారంతా సముద్రంలోకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత కచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందేనని ఆదేశాలున్నాయి. వారు తీసుకొచ్చిన సీఫుడ్ను కూడా పరీక్షించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా