కరవు కోరల్లో ఇంగ్లాండ్.. ఖాళీగా రిజర్వాయర్లు.. నీటి వాడకంపై ఆంక్షలు
ఇంగ్లాండ్ కరవుతో (Drought) కటకటలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఈఏడాది తీవ్ర లోటు వర్షపాతం నమోదయ్యింది. పరిస్థితులను సమీక్షించిన అధికారులు ఇంగ్గాండ్లోని (England) చాలా ప్రాంతాల్లో కరువు ప్రకటించారు.
లండన్: ఇంగ్లాండ్ కరవుతో (Drought) కటకటలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది తీవ్ర లోటు వర్షపాతం నమోదయ్యింది. దీంతో ప్రధాన నదుల్లో ప్రవాహం తగ్గిపోతుండగా రిజర్వాయర్లు కూడా ఎండిపోతున్నాయి. పరిస్థితులను సమీక్షించిన అధికారులు ఇంగ్గాండ్లోని (England) చాలా ప్రాంతాల్లో కరవు ప్రకటించారు. కెంట్ అండ్ సౌత్ లండన్, హెర్ట్స్ అండ్ నార్త్ లండన్, థేమ్స్, ఈస్ట్ మిడ్ల్యాండ్స్, సోలెంట్ అండ్ సౌత్ డౌన్స్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కరవును ప్రకటించగా.. త్వరలోనే మిగతా ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గడిచిన యాభై ఏళ్లగా ఈ స్థాయిలో వేసవి కాలం ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని నెలలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఇంగ్లాండ్లో.. వేసవి తాపానికి రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి. జులై నాటికి ఇంగ్లాండ్లో ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యంలో కేవలం 65శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పంటల విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్యారెట్, ఉల్లి, షుగర్ బీట్, యాపిల్ పంటల సాగు దాదాపు 10 శాతం నుంచి 50శాతం నష్టపోతుందని అంచనా. మరోవైపు ఆహారంలేమితో పశువులు అల్లాడుతున్నాయని.. దీని ప్రభావం పాల ఉత్పత్తులపైనా పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనడంతో సమీక్షించిన అధికారులు నీటి పొదుపు చర్యలకు ఉపక్రమించారు.
ఈ నేపథ్యంలో అనేక నగరాల్లో కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన ఇంగ్లాండ్ అధికారులు.. అక్కడ నీటి వాడకంపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా గొట్టపు పైపుల ద్వారా ట్యాప్ వాటర్తో కార్లను కడగడంపై నిషేధంతో పాటు వాహనాలు, భవనాలు, కిటికీలను శుభ్రపరచడానికి స్ప్రింక్లర్లను ఉపయోగించకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఇంగ్లాండ్లో నెలకొన్న కరవు పరిస్థితులు అక్కడి ఆహార ఉత్పత్తులపైనా పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళా దుంపతోపాటు మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
పాకిస్థాన్ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలపై మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. -
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
ప్రమాదకర టాస్క్లతో యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందనే విమర్శలున్న బ్లూవేల్ ఛాలెంజ్ (Blue Whale Challenge) మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు