suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
ఈజిప్ట్లోని సూయిజ్ కాలువలో ముడి చమురు సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్ మరమ్మతుకు గురై ఆగిపోయింది.
కైరో: ముడి చమురును సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్ ఆదివారం ఈజిప్ట్లోని సూయిజ్ కాలువలో మరమ్మతుకు గురై ఆగిపోయింది. దీంతో ఈ జలమార్గంలో రవాణాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు చమురును సరఫరా చేస్తున్న మాల్టా దేశ నౌకకు యాంత్రికపరమైన లోపం తలెత్తడంతో ఆగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ట్యాంకర్ వెనక మరో ఎనిమిది నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు. మూడు పడవలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆ ట్యాంకర్ను వేరే చోటుకు తరలించాయని, దీంతో అక్కడి ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!