Omicron infection: బూస్టర్ డోసు కంటే దానితోనే మెరుగైన రోగనిరోధకత..!
ఒమిక్రాన్ వల్ల కలిగే బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్తో లభించే రోగనిరోధకత.. వివిధ రకాలైన కరోనా వేరియంట్లను అడ్డుకోగలదట. బూస్టర్ డోసు కంటే ఈ ఇన్ఫెక్షన్తోనే మెరుగైన నిరోధక శక్తి లభిస్తుందట.
వాషింగ్టన్: ఒమిక్రాన్ వల్ల కలిగే బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్తో లభించే రోగనిరోధకత.. వివిధ రకాలైన కరోనా వేరియంట్లను అడ్డుకోగలదట. బూస్టర్ డోసు కంటే ఈ ఇన్ఫెక్షన్తోనే మెరుగైన నిరోధక శక్తి లభిస్తుందట. టీకా తయారీ సంస్థ బయోన్టెక్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ చేసిన అధ్యయనాల్లో ప్రాథమికంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉనికి చాటుతోన్న వేళ..ఈ విషయం ఆశాజనకంగా ఉంది. మరో కొత్త వేరియంట్ సోకినా.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనకర్తలు అంచనా వేస్తున్నారు.
‘బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్.. మరో టీకా డోసుకు తప్పనిసరిగా సమానమని మనం భావించాలి’ అంటూ బయోన్టెక్ అధ్యయాన్ని సమీక్షించిన ప్రొఫెసర్ జాన్ వెర్రీ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎవరైనా కొవిడ్ బారినపడితే.. వారు మరో బూస్టర్ డోసు తీసుకునేందుకు వేచి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే బాధితుల నాసికా శ్లేష్మంలో యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే నిర్వీర్యం చేయడంలో అవి సహకరించవచ్చన్నారు. అయితే టీకాలు పొందని వారికి ఒమిక్రాన్ సోకితే ఈ విధమైన ప్రతిస్పందన కనిపించడం లేదని తెలిపారు. తర్వాత వారికి దీనికి భిన్నమైన వేరియంట్ సోకితే సమస్యగా మారొచ్చన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. చైనాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆరువారాలుగా చైనా ప్రజలు కఠిన లాక్డౌన్ ఆంక్షలు అనుభవించారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మరిన్ని కొత్త ఉత్పరివర్తనలు పుట్టుకొస్తున్నాయి. దేశాలు ఆంక్షలను సడలిస్తుండటంతో దీని వ్యాప్తికి మరింత అవకాశం ఏర్పడుతోంది. ఈ సమయంలో ఒమిక్రాన్ లక్ష్యంగా చేసుకుని టీకాలను అభివృద్ధి చేయాలా వద్దా అనేదానిపై నియంత్రణ సంస్థలు యోచిస్తున్నాయని ఈ అధ్యయనకర్తల్లో ఒకరు వెల్లడించారు.
మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్తో భారత్ వంటి దేశాల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే కనిపించింది. అయితే భవిష్యత్తులో వచ్చే వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్న హామీ లేదు. రానున్న రోజుల్లో మహమ్మారి తీవ్రత.. ప్రజల రోగ నిరోధకత స్థాయులపైనే పూర్తిగా ఆధారపడి ఉండదని, వైరస్లో వచ్చే మార్పులపై కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!