Long Covid: ఒమిక్రాన్తో దీర్ఘకాల కొవిడ్ ముప్పు తక్కువే!
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బారిన పడినవారు దీర్ఘకాల కొవిడ్తో బాధపడే అవకాశాలు తక్కువేనని తాజాగా ఓ బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. లండన్ కింగ్స్ కాలేజ్కు చెందిన పరిశోధకులు.. జోయ్ కొవిడ్ యాప్ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం...
బ్రిటన్ అధ్యయనంలో వెల్లడి
లండన్: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బారిన పడినవారు దీర్ఘకాల కొవిడ్తో బాధపడే అవకాశాలు తక్కువేనని తాజాగా ఓ బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. లండన్ కింగ్స్ కాలేజ్కు చెందిన పరిశోధకులు.. జోయ్ కొవిడ్ యాప్ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. బ్రిటన్లో డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేవ్ సమయంలో ఇన్ఫెక్షన్ సోకినవారిలో దీర్ఘకాల కొవిడ్ అభివృద్ధి చెందే అవకాశాలు 20 శాతం నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. రోగి వయస్సు, చివరి డోసు ఎప్పుడు తీసుకున్నారో బట్టి ఈ శాతం మారుతున్నట్లు తెలిపారు.
ఈ అధ్యయనంలో.. ఒమిక్రాన్ గరిష్ఠ స్థాయి(డిసెంబర్ 2021- మార్చి 2022) సమయంలో వైరస్ బారిన పడిన 56,003 మందిలో 4.5 శాతం మంది దీర్ఘకాల కొవిడ్తో బాధపడుతున్నట్లు తేలింది. అదే, జూన్-నవంబర్ 2021లో డెల్టా వేవ్ సమయంలో 41,361 బాధితుల్లో ఇది 10.8 శాతంగా నమోదైంది. ‘లాన్సెట్ జర్నల్’లోనూ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. అయితే.. దీనర్థం దీర్ఘకాల కొవిడ్ రోగుల సంఖ్య తగ్గిపోతున్నట్లు కాదని పరిశోధకుల బృందం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ మందికి సోకిన నేపథ్యంలో.. బాధితుల సంఖ్య ఎక్కువే ఉందని చెప్పింది.
ఒమిక్రాన్తో లాంగ్ కొవిడ్ ముప్పు తక్కువగా ఉండటం మంచి వార్తే అయినప్పటికీ.. దీర్ఘకాల లక్షణాలకు చికిత్సను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాన పరిశోధకుడు డా.క్లైర్ స్టీవ్స్ ఓ వార్తాసంస్థతో అన్నారు. మరోవైపు.. ఒమిక్రాన్ వేవ్ తర్వాత దేశంలో 4.38 లక్షల మంది దీర్ఘకాల కొవిడ్తో బాధపడుతున్నారని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం గత నెలలో తెలిపింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తర్వాత దీర్ఘకాల లక్షణాల ముప్పు తక్కువే ఉందని, అయితే.. ఇది రెండు డోసులు పూర్తయిన వ్యక్తుల్లో మాత్రమేనని పేర్కొంది.
దీర్ఘకాల కొవిడ్ కారణంగా అలసట, మెదడు మొద్దుబారడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు.. వారాలు లేదా నెలల తరబడి కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో.. గత వేరియంట్ల మాదిరి ఒమిక్రాన్ కూడా దీర్ఘకాల కొవిడ్కు కారణమవుతుందా? అని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒమిక్రాన్తో లాంగ్ కొవిడ్ ముప్పు అంతగా లేదని చూపిన మొదటి అధ్యయనంగా కింగ్స్ కాలేజ్ పరిశోధన నిలిచింది! అయితే, ఒమిక్రాన్ ఎందుకు తక్కువ దీర్ఘకాల కొవిడ్ ముప్పు కలిగి ఉందో నిర్ధారించేందుకు మరింత అధ్యయనం అవసరమని బృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?