Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్పై విరుచుకుపడిన రష్యా!
జర్మనీలో జీ-7 నేతల కీలక భేటీ వేళ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఓ నివాస భవనంపై జరిపిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందగా, ఓ చిన్నారితోసహా ముగ్గురు గాయపడ్డారు...
కీవ్: జర్మనీలో జీ-7 నేతల కీలక భేటీ వేళ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఓ నివాస భవనంపై జరిపిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందగా, ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. నగర మేయర్ విటాలి క్లిట్ష్కో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జీ-7, నాటో సమావేశాలకు ముందు ఉక్రెనియన్లను భయపెట్టడానికే ఈ దాడి జరిపిందంటూ ఆరోపించారు. దాదాపు మూడు వారాల తర్వాత కీవ్ లక్ష్యంగా జరిగిన దాడి ఇది. రష్యాను నిలువరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ జీ-7 దేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చిన సమయంలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు.. ఉత్తర, పశ్చిమ ఉక్రెయిన్లలోని మూడు సైనిక కేంద్రాలపై తమ సేనలు దాడులు చేపట్టాయని మాస్కో ప్రకటించింది. వాటిలో ఒకటి పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉందని వెల్లడించింది.
కీవ్పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అనాగరిక చర్య అంటూ రష్యాపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ వారంలో జీ-7తోపాటు నాటో శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. రష్యా బంగారం దిగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయంతో జీ-7 చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మరిన్ని ఆంక్షల కోసం డిమాండ్ చేశారు. కీవ్ దాడిలో గాయపడిన చిన్నారిని స్ట్రెచర్పై తీసుకెళ్తున్న ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసిన ఆయన.. ‘రష్యా క్షిపణి ఆమె ఇంటిని ధ్వంసం చేసే వరకు కీవ్లోని ఈ ఏడేళ్ల చిన్నారి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇలా దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. క్రెమ్లిన్పై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మరిన్ని భారీ ఆయుధాలు సమకూర్చేలా.. జీ-7 నేతలు స్పందించాలి. రష్యా కుటిల సామ్రాజ్యవాదాన్ని ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే