Iran Protests: ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం.. ‘ఆస్కార్’ సినిమా నటి అరెస్టు!
దేశంలో కొనసాగుతోన్న ఆందోళనలకు మద్దతు పలికిన ప్రముఖ ఇరానియన్ నటి తారానేహ్ అలీదూస్తిని ప్రభుత్వం తాజాగా అరెస్టు చేసింది. 2016లో ఆస్కార్ సాధించిన ‘ది సేల్స్మన్’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
టెహ్రాన్: దేశంలో మూడు నెలల నుంచి కొనసాగుతోన్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనల(Iran Protests)పై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఇద్దరికి ఉరి శిక్ష అమలు చేసిన ప్రభుత్వం.. అనేక మందికి జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఇరానియన్ నటి తారానేహ్ అలీదూస్తి(Taraneh Alidoosti)ని అరెస్టు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఆమె సంఘీభావం తెలపడమే దానికి కారణం. హిజాబ్ ఆందోళనల విషయంలో అబద్ధాలను వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
టెహ్రాన్లో నిరసనల్లో పాల్గొన్న మొహసెన్ షెకారీ అనే యువకుడిని ఇరాన్ ఇటీవల ఉరి తీసింది. అలీదూస్తీ దీన్ని తీవ్రంగా ఖండించారు. దీంతోపాటు అతని ఉరిశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంపై అంతర్జాతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఈ రక్తపాతాన్ని చూస్తూ స్పందించని ప్రతి అంతర్జాతీయ సంస్థ.. మానవత్వానికే మాయని మచ్చ’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా విమర్శించారు. అయితే, 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఇటీవల తొలగించడం గమనార్హం.
38 ఏళ్ల అలీదూస్తి ఇరాన్లో పేరొందిన నటీమణుల్లో ఒకరు. 2016లో ఆస్కార్ పురస్కారం సాధించిన ‘ది సేల్స్మన్(The Salesman)’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు, వెబ్సిరీస్లలో నటించారు. దేశవ్యాప్త నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహ్సా అమీని మరణంతో దేశంలో ఆందోళనలు ఎగసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?