Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
బెన్ను గ్రహశకలం ఉపరితలం నుంచి ఓసిరిస్ రెక్స్ స్పేస్క్రాఫ్ట్ (OSIRIS-REx Mission) నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. వాటి గుట్టు విప్పే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
Image : Astromaterials
ఇంటర్నెట్ డెస్క్ : ఓసిరిస్ రెక్స్ స్పేస్క్రాఫ్ట్ (OSIRIS-REx Mission) సాయంతో బెన్ను (Bennu) గ్రహశకలం నుంచి దుమ్ము, గులకరాళ్ల నమూనాలను నాసా ఇటీవల భూమి పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తలు వాటి గుట్టు విప్పే పనిలో పడ్డారు. ఓసిరిస్ రెక్స్ ఏవియానిక్స్ డెక్లో నల్లటి దుమ్ము, శిథిలాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ తరువాత నమూనాలు తీసుకొచ్చిన పరికరంపై ఉన్న ప్రాథమిక మూతను తొలగించినట్లు నాసా (NASA) పేర్కొంది. స్పేస్క్రాఫ్ట్ ఆదివారం యుటా ఎడారిలో ల్యాండ్ అయ్యింది. దానిని హ్యూస్టన్లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. శకలాల నమూనాలు, వాటిని సురక్షితంగా భద్రపరిచే నిపుణుల బృందం ఇక్కడ ఉంటుంది. క్యాప్సుల్ నుంచి టచ్ అండ్ గో శాంపిల్ అక్విజిషన్ మెకానిజం (ట్యాగ్సమ్)ను విడదీసేందుకు పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ల్యాబ్ను సిద్ధం చేశారు. తాజాగా అల్యూమినియం మూతను ఓ భారీ గ్లోవ్బాక్స్లో ఉంచి తొలగించినట్లు నాసా పేర్కొంది.
ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!
ట్యాగ్సమ్ను క్యాన్స్టర్ నుంచి పూర్తిగా విడదీసిన తర్వాత దాన్ని సీల్డ్ ట్రాన్స్ఫర్ కంటైనర్లోకి మార్చుతారు. అందులో దాదాపు రెండుగంటలపాటు నైట్రోజన్ వాయువుతో కూడిన వాతావరణం ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ మరో ప్రత్యేకమైన గ్లోవ్బాక్సులోకి మారుస్తారు. దాంతో నమూనాలను వేరు చేసే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కొన్ని నెలలు సాధన చేశారు. బెన్ను గ్రహశకలం నుంచి తీసుకొచ్చిన నమూనాలను అక్టోబరు 11న బయటి ప్రపంచానికి చూపించే అవకాశం ఉంది. ఆ ఘట్టాన్ని నాసా వెబ్సైట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
2016లో నాసా ‘ఓసిరిస్- రెక్స్ (OSIRIS-REx)’ అనే మిషన్ను ప్రయోగించింది. 2020లో అది బెన్ను గ్రహశకలం ఉపరితలం నుంచి దుమ్ము, రాళ్లను సేకరించింది. అనంతరం భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వ్యోమనౌక నుంచి విడిపోయిన క్యాప్స్యూల్.. నాలుగు గంటల తర్వాత భూమిని చేరుకుంది. అగ్ర రాజ్యానికి చెందిన ‘నాసా (NASA)’.. ఓ గ్రహశకలం నమూనా (Asteroid Samples)లు సేకరించి, భూమి పైకి తీసుకురావడం ఇదే మొదటిసారి. అంతకుముందు జపాన్ మాత్రమే ఈ విధంగా గ్రహశకలానికి చెందిన నమూనాలను భూమి మీదికి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం .. వీటో పవర్ వాడిన అమెరికా
గాజాలో కాల్పుల విరమణపై ఐరాస భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని తన అసాధారణ అధికారాలతో అమెరికా(America) అడ్డుకుంది. -
పాలస్తీనీయులకు ఎందుకీ శిక్ష?
హమాస్ క్రూరత్వానికి.. పాలస్తీనా ప్రజలను సామూహికంగా శిక్షించడం సరికాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. -
భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తేలేం: పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. -
కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలింపు
గాజాస్ట్రిప్లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. -
పన్నూ హత్యకు కుట్ర బాధ్యులపై చర్య తీసుకోవాలి: అమెరికా
తమ వ్యూహాత్మక భాగస్వామి భారత్తో బంధాన్ని మరింత దృఢపరచుకుంటున్నామని, అదే సమయంలో న్యూయార్క్లో సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతున్నామని అమెరికా గురువారం స్పష్టం చేసింది. -
చర్చలు, దౌత్యంతోనే పరిష్కరించుకోవాలి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణపై, ఆ ప్రాంతంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని శుక్రవారం లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. -
బైడెన్ కుమారునిపై నేరాభియోగాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ (53) పై గురువారం కాలిఫోర్నియాలో తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. -
అమెరికాలో భారతీయ హోటల్ మేనేజర్కు 57 ఏళ్ల జైలు
అమెరికాలోని జార్జియాలో హోటల్ మేనేజర్గా ఉన్న భారత జాతీయుడు శ్రీష్ తివారి(71)కి స్థానిక న్యాయస్థానం 57 ఏళ్ల జైలుశిక్ష విధించింది. -
అందాల శ్వేత మకరం!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది బల్లి కాదు. అరుదైన శ్వేతరంగు మొసలి. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో గేటర్లాండ్ సరీసృపాల పార్కులో ఇది జన్మించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. -
సాగరంలో పెరుగుతున్న ఆమ్లత్వం
ఉష్ణ మండలానికి ఎగువన, దిగువన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత గత 40 ఏళ్లలో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. -
విదేశీ విద్యార్థులపై జీవనవ్యయ భారం
ఉన్నత విద్య కోసం తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. -
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
రష్యాలో రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్.. 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు