Russia: పుతిన్ పిలుపు.. ఆర్మీలో చేరిన 2 లక్షల మంది పౌరులు!
రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు మేరకు 2 లక్షల మంది పౌరులు సైన్యంలో చేరినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు తెలిపారు. వీరందర్నీ వీలైనంత త్వరగా పోరాటానికి సిద్ధం చేయాలని ఆర్మీ, నేవీ కమాండర్లను ఆయన ఆదేశించారు.
మాస్కో: ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా తన సైన్యాన్ని పటిష్ఠం చేసుకునేందుకు నిర్బంధ సైనిక సమీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారే కాకుండా వివిధ వర్గాల పౌరులు కూడా రష్యన్ ఆర్మీలో చేరాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది ఆర్మీలో చేరినట్లు రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు మంగళవారం తెలిపారు. ‘‘ పుతిన్ పిలుపు మేరకు ఇప్పటి వరకు 2 లక్షల మంది పౌరులు ఆర్మీలో చేరారు’’ అని సెర్గేయ్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా కూడా అధిక మొత్తంలోనే సైనికులను కోల్పోతోంది. దీంతో నిర్బంధ సైనిక సమీకరణ ద్వారా కనీసం 3 లక్షల మంది సైనికులను పోగు చేయాలని భావిస్తోంది. వీరందరినీ బృందాలుగా విభజించి 80 ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 6 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు యువకులు దేశం విడిచి పారిపోతున్నారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 2 లక్షల మంది రష్యా పౌరులు సరిహద్దులు దాటి తమ దేశంలో ప్రవేశించినట్లు ఖజకిస్థాన్ వెల్లడించింది.
సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, వారిని పోరాటానికి సిద్ధం చేయాలని మిలటరీ, నేవీ కమాండర్లకు రక్షణ మంత్రి సెర్గేయ్ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. శిక్షణ పూర్తయితేనే వారిని రంగంలోకి దించగలమన్నారు. మరోవైపు రైతులను కూడా సైన్యంలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా పలు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. తాజా నిర్ణయం దీనికి మరింత ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ