Russia: పుతిన్ పిలుపు.. ఆర్మీలో చేరిన 2 లక్షల మంది పౌరులు!
రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు మేరకు 2 లక్షల మంది పౌరులు సైన్యంలో చేరినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు తెలిపారు. వీరందర్నీ వీలైనంత త్వరగా పోరాటానికి సిద్ధం చేయాలని ఆర్మీ, నేవీ కమాండర్లను ఆయన ఆదేశించారు.
మాస్కో: ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా తన సైన్యాన్ని పటిష్ఠం చేసుకునేందుకు నిర్బంధ సైనిక సమీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారే కాకుండా వివిధ వర్గాల పౌరులు కూడా రష్యన్ ఆర్మీలో చేరాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది ఆర్మీలో చేరినట్లు రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు మంగళవారం తెలిపారు. ‘‘ పుతిన్ పిలుపు మేరకు ఇప్పటి వరకు 2 లక్షల మంది పౌరులు ఆర్మీలో చేరారు’’ అని సెర్గేయ్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా కూడా అధిక మొత్తంలోనే సైనికులను కోల్పోతోంది. దీంతో నిర్బంధ సైనిక సమీకరణ ద్వారా కనీసం 3 లక్షల మంది సైనికులను పోగు చేయాలని భావిస్తోంది. వీరందరినీ బృందాలుగా విభజించి 80 ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 6 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు యువకులు దేశం విడిచి పారిపోతున్నారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 2 లక్షల మంది రష్యా పౌరులు సరిహద్దులు దాటి తమ దేశంలో ప్రవేశించినట్లు ఖజకిస్థాన్ వెల్లడించింది.
సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, వారిని పోరాటానికి సిద్ధం చేయాలని మిలటరీ, నేవీ కమాండర్లకు రక్షణ మంత్రి సెర్గేయ్ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. శిక్షణ పూర్తయితేనే వారిని రంగంలోకి దించగలమన్నారు. మరోవైపు రైతులను కూడా సైన్యంలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా పలు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. తాజా నిర్ణయం దీనికి మరింత ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్