Pakistan: పాకిస్థాన్ జనాభాలో ‘హిందువుల’ సంఖ్య ఎంతో తెలుసా..?
పాకిస్థాన్లో హిందువుల జనాభా ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 22లక్షల మంది హిందువులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
2శాతం కంటే తక్కువేనన్న తాజా నివేదిక
పెషావర్: దేశ విభజన అనంతరం పాకిస్థాన్లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్థాన్లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68లక్షలుగా ఉండగా వారిలో మైనారిటీ హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్థాన్ పేర్కొంది. నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) డేటా ప్రకారం, పాకిస్థాన్ మొత్తం జనాభాలో మైనారిటీల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువే. వారిలో మైనారిటీ హిందువులే అత్యధికమని తాజా నివేదిక వెల్లడించింది.
ఎన్ఐడీఆర్ఏ నివేదిక ప్రకారం, పాకిస్థాన్లో 18 కోట్ల 68లక్షల జనాభా ఉండగా వారిలో 18కోట్ల 25లక్షల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనారిటీల సంఖ్యను అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22లక్షల 10వేల (22,10,566) మంది హిందువులు ఉండగా.. 18,73,348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్లు తేలింది. అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్ 14వేలతోపాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇక 2వేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనారిటీ వర్గాలు పాకిస్థాన్లో 11 ఉన్నట్లు గుర్తించింది. బౌద్ధమతస్థులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్ మతాలకు చెందినవారు 1418 మందితోపాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్లు ఎన్ఐడీఆర్ఏ నివేదిక పేర్కొంది.
ఇదిలాఉంటే, 2శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతోపాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువైనట్లు నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, మైనారిటీలుగా ఉన్న వారిలో దాదాపు 95శాతం మంది సింధ్ ప్రావిన్సులోనే జీవిస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదనే చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’