Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి శనివారం ఓ భారీ నౌక రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులోని దాదాపు 24మంది సిబ్బంది గల్లంతయ్యారు........
హాంకాంగ్: దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి శనివారం ఓ భారీ నౌక రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులోని దాదాపు 24మంది సిబ్బంది గల్లంతయ్యారు. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. హాంకాంగ్కు నైరుతి దిశగా 160 నాటికల్ మైళ్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ నౌక.. చబా తుపాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రస్థాయిలో దెబ్బతింది. ఈ క్రమంలోనే అది రెండు ముక్కలై.. నీట మునిగింది. అప్పటికే అప్రమత్తమైన 30 మంది సిబ్బంది నౌక నుంచి బయటకుదూకారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్ సాయంతో ముగ్గురిని రక్షించి, వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతావారి ఆచూకీ తెలియరాలేదని, వారిని కనుగొనేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే, మొదటి హెలికాప్టర్ రాకముందే వారు అలల ధాటికి కొట్టుకుపోయి ఉండొచ్చని ప్రాణాలతో బయటపడిన ఆ ముగ్గురు పేర్కొన్నారు.
దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన తుఫాను.. శనివారం మధ్యాహ్నం దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో తీరాన్ని తాకింది. హాంకాంగ్లోని అధికారులకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:25 గంటలకు ఈ ప్రమాదం గురించి సమాచారం అందింది. అయితే, ఘటనాస్థలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురు గాలుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారుతోందని అధికారులు తెలిపారు. నౌక నీటమునిగిన ప్రదేశంలో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఫ్లయింగ్ సర్వీస్ రెండు రకాల ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్లను, నాలుగు హెలికాప్టర్లను పంపింది. చైనా అధికారులు కూడా రెస్క్యూ బోట్ను పంపారు. గల్లంతైనవారి సంఖ్య భారీగానే ఉండటంతో.. అన్వేషణ ప్రాంత పరిధిని పెంచుతామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.