Pakistan: రండిబాబూరండి.. మా దేశంలో స్థిరపడండి!
పాకిస్థాన్ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. విదేశాల వచ్చే నిధులు నిలిచిపోవడం.. దేశీయ వాణిజ్యం క్షీణించడం, పన్నులు సరిగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. రుణాలు కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు పాక్.. దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ సమస్యనుంచి
విదేశీ పెట్టుబడిదారులకు పాకిస్థాన్ ఆఫర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. విదేశాల వచ్చే నిధులు నిలిచిపోవడం.. దేశీయ వాణిజ్యం క్షీణించడం, పన్నులు సరిగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. బ్యాంకుల నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు పాక్.. దిక్కుతోచని స్థితిలో ఉంది. అయితే, ఈ సమస్య నుంచి గట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. తమ దేశంలో భారీమొత్తంలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు నూతన జాతీయ భద్రత పాలసీని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్లో చాలా మంది సంపన్నులు దేశాన్ని వదిలి మలేషియా, టర్కీలో పెట్టుబడులు పెడుతున్నారు. వారి దృష్టి పాకిస్థాన్పై పడేలా చేయడమే లక్ష్యంగా ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్ వ్యాపారులు.. పాక్లో పెట్టుబడులు పెడితే వారికి తమ దేశ పౌరసత్వం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీరితోపాటు చైనీయులు, అమెరికన్లు, అమెరికన్ సిక్కులకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ఉంటున్న సిక్కులు తప్పకుండా పాక్లో పెట్టుబడులు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశాయి. విదేశీయులకు పాక్ పౌరసత్వాన్ని కల్పించడం ద్వారా కొన్ని బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తమ దేశానికి వస్తాయని పాక్ ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)