Afghanistan: అమెరికాకు సాయం చేస్తోంది పాకిస్థానే!
తమ దేశంలోకి ప్రవేశించేందుకు అమెరికన్ డ్రోన్లకు పాకిస్థాన్(Pakistan) తన గగనతల సాయం అందిస్తోందని అఫ్గానిస్థాన్(Afghanistan) రక్షణశాఖ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆరోపించారు...
అఫ్గాన్ రక్షణ మంత్రి ఆరోపణలు
కాబుల్: తమ దేశంలోకి ప్రవేశించేందుకు అమెరికన్ డ్రోన్లకు పాకిస్థాన్(Pakistan) తన గగనతల సాయం అందిస్తోందని అఫ్గానిస్థాన్(Afghanistan) రక్షణశాఖ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆరోపించారు. ఈ చొరబాట్లను అఫ్గాన్పై అగ్రరాజ్య యుద్ధం కొనసాగింపు చర్యలుగా అభివర్ణించారు. అఫ్గాన్లో తలదాచుకున్న అల్ఖైదా చీఫ్ అల్ జవహరీని డ్రోన్ దాడిలో అంతమొందించినట్టు అమెరికా(America) గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ముజాహిద్ అమెరికాతో పాటు పాక్పై విమర్శలకు దిగారు. ఇప్పుడు కూడా అమెరికా డ్రోన్లు కాబుల్ మీదుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయని చెప్పారు.
డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నకు ముజాహిద్ బదులిస్తూ.. ‘పాక్ గగనతలాన్ని వినియోగించి అక్కడినుంచి అఫ్గాన్లోకి ప్రవేశిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది’ అని తెలిపారు. పాక్ తన గగనతలాన్ని అఫ్గాన్కు వ్యతిరేకంగా ఉపయోగించొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాక్ సైన్యం స్పందించాల్సి ఉంది. ఇటీవల జవహరీపై డ్రోన్ దాడి సందర్భంగానూ ఈ తరహా ఆరోపణలు రాగా.. పాక్ తిరస్కరించింది. మరోవైపు అఫ్గాన్లో అమెరికా తన డ్రోన్లను మోహరించడం.. తమ దేశం, గగనతలంపై దాడిగా భావిస్తున్నట్లు ముజాహిద్ పేర్కొన్నారు. ఈ చట్టవిరుద్ధ చర్యలను మానుకోవాలన్నారు.
జవహరీని తుదముట్టించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ముజాహిద్ తెలిపారు. జవహరీ అఫ్గాన్లో ఉంటున్నట్లు, ఆయన మరణించినట్లు తాలిబన్లు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. ఇదిలా ఉండగా.. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటినుంచి అఫ్గాన్, పాక్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గాన్లో ఆశ్రయం పొందుతున్న మిలిటెంట్ గ్రూపులు తరచూ తమ భూభాగంపై దాడులు చేస్తున్నాయని పాక్ ఆరోపిస్తుండగా.. తాలిబన్లు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్లో తూర్పు అఫ్గాన్లో పాక్ వైమానిక దాడుల కారణంగా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..