Pakistan: పాక్ నెత్తిన 18 బిలియన్ డాలర్ల టైమ్బాంబ్..!
అసలే డబ్బులు లేక ఆర్థిక సంక్షోభంలో విలవిల్లాడుతున్న పాక్(Pakistan)పై మరో బాంబు పడనుంది. ఇరాన్(Iran)తో చేసుకొన్న ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఏకంగా 18 బిలియన్ డాలర్లు ఫైన్గా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్(Pakistan)కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయి. దాదాపు 18 బిలియన్ డాలర్లను జరిమానా రూపంలో ఇరాన్కు చెల్లించాల్సి రావచ్చు. ఓ గ్యాస్ పైపులైన్ నిర్మాణం సకాలంలో పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల పాకిస్థాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ నూర్ ఆలమ్ ఖాన్ ఓ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు. గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్సు రూపంలో సమీకరించిన 4 బిలియన్ డాలర్లను వినియోగించుకోని విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ నిధులను ఇరాన్(Iran) నుంచి పైపులైన్ల ద్వారా గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి మూడు మెగా ప్రాజెక్టులు నిర్మించేందుకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో నిధులు నిరుపయోగంగా పడిఉన్నాయి.
ఆంక్షలు విధించారుగా.. పెనాల్టీ మీరే కట్టండి..
ఈ పైపులైన్ ప్రాజెక్టు కనుక పాకిస్థాన్ సకాలంలో పూర్తి చేయకపోతే ఇరాన్కు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్పై ఆంక్షలు ఉన్న సమయంలో పైపులైన్ నిర్మించి గ్యాస్ దిగుమతి చేసుకొంటే అమెరికా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపునిచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ఇరాన్ దాదాపు 18 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉందని పాక్ పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా రాయబారితో చర్చించామని వెల్లడించారు. ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపులు ఇవ్వని పక్షంలో ఇరాన్కు చెల్లించాల్సిన జరిమానా సొమ్మును అయినా ఇవ్వాలని కోరామన్నారు.
తాజాగా పాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కూడా ఇదే రకంగా స్పందించారు. విదేశాంగశాఖ అధికారులు అమెరికా రాయబారితో మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించాలని సూచించారు. దీంతోపాటు పెట్రోలియం శాఖ ఇచ్చిన రెండు ఆప్షన్లను కూడా వివరించాలని సూచించారు. వాస్తవానికి ఈ గ్యాస్ ప్రాజెక్టుపై కొన్నేళ్ల క్రితమే ఇరాన్-పాకిస్థాన్ చర్చించాయి. భారత్ కూడా ఈ పైపులైన్ ప్రాజెక్టులో భాగమైంది. కానీ, ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు నుంచి వైదొలగింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ (Pakistan) అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (Imf) విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. రుణ వడ్డీ రేటును 17 శాతం నుంచి 19 శాతం పెంచడానికి అంగీకరించింది. దీంతో 6.5 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ నుంచి 1.1 బిలియన్ డాలర్ల అత్యవసర రుణం మంజూరుకు మార్గం సుగమమైంది. ఇలాంటి సమయంలో ఇరాన్కు ఏకంగా 18 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!