Pakistan: పాక్ నెత్తిన 18 బిలియన్ డాలర్ల టైమ్బాంబ్..!
అసలే డబ్బులు లేక ఆర్థిక సంక్షోభంలో విలవిల్లాడుతున్న పాక్(Pakistan)పై మరో బాంబు పడనుంది. ఇరాన్(Iran)తో చేసుకొన్న ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఏకంగా 18 బిలియన్ డాలర్లు ఫైన్గా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్(Pakistan)కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయి. దాదాపు 18 బిలియన్ డాలర్లను జరిమానా రూపంలో ఇరాన్కు చెల్లించాల్సి రావచ్చు. ఓ గ్యాస్ పైపులైన్ నిర్మాణం సకాలంలో పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల పాకిస్థాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ నూర్ ఆలమ్ ఖాన్ ఓ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు. గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్సు రూపంలో సమీకరించిన 4 బిలియన్ డాలర్లను వినియోగించుకోని విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ నిధులను ఇరాన్(Iran) నుంచి పైపులైన్ల ద్వారా గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి మూడు మెగా ప్రాజెక్టులు నిర్మించేందుకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో నిధులు నిరుపయోగంగా పడిఉన్నాయి.
ఆంక్షలు విధించారుగా.. పెనాల్టీ మీరే కట్టండి..
ఈ పైపులైన్ ప్రాజెక్టు కనుక పాకిస్థాన్ సకాలంలో పూర్తి చేయకపోతే ఇరాన్కు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్పై ఆంక్షలు ఉన్న సమయంలో పైపులైన్ నిర్మించి గ్యాస్ దిగుమతి చేసుకొంటే అమెరికా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపునిచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ఇరాన్ దాదాపు 18 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉందని పాక్ పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా రాయబారితో చర్చించామని వెల్లడించారు. ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపులు ఇవ్వని పక్షంలో ఇరాన్కు చెల్లించాల్సిన జరిమానా సొమ్మును అయినా ఇవ్వాలని కోరామన్నారు.
తాజాగా పాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కూడా ఇదే రకంగా స్పందించారు. విదేశాంగశాఖ అధికారులు అమెరికా రాయబారితో మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించాలని సూచించారు. దీంతోపాటు పెట్రోలియం శాఖ ఇచ్చిన రెండు ఆప్షన్లను కూడా వివరించాలని సూచించారు. వాస్తవానికి ఈ గ్యాస్ ప్రాజెక్టుపై కొన్నేళ్ల క్రితమే ఇరాన్-పాకిస్థాన్ చర్చించాయి. భారత్ కూడా ఈ పైపులైన్ ప్రాజెక్టులో భాగమైంది. కానీ, ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు నుంచి వైదొలగింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ (Pakistan) అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (Imf) విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. రుణ వడ్డీ రేటును 17 శాతం నుంచి 19 శాతం పెంచడానికి అంగీకరించింది. దీంతో 6.5 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ నుంచి 1.1 బిలియన్ డాలర్ల అత్యవసర రుణం మంజూరుకు మార్గం సుగమమైంది. ఇలాంటి సమయంలో ఇరాన్కు ఏకంగా 18 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.