Imran Khan: పాకిస్థాన్ ప్రధానిపై అవిశ్వాస తీర్మానం.. మార్చి 28కి సభ వాయిదా..!
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఆయపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు భావించారు.
సోమవారం ఓటింగ్ జరిగే అవకాశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు భావించారు. కానీ, సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభ సోమవారానికి వాయిదా పడింది. ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మార్చి 28నే చర్చ జరుగనుంది. దీంతో అప్పటివరకు ఇమ్రాన్ ఖాన్కు ఉపశమనం లభించినట్లుయ్యింది.
దేశంలో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) కారణమంటూ అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వంపై మార్చి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని భావించారు. దీంతో విపక్ష పార్టీ నేతలందరూ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత షెహ్బాజ్ షరీఫ్, పీపీపీ ఛైర్మన్ బిలాల్వాల్ భుట్టో-జర్దారీతోపాటు పీపీపీ ఉపఛైర్మన్ ఆసిఫ్ ఆలీ జర్దారీ వంటి అగ్రనేతలు పార్లమెంటుకు హాజరైనట్లు పాక్ మీడియా వెల్లడించింది.
ఇదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వంలోని 23 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రధాని ఇమ్రాన్ఖాన్కు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తాను చివరి వరకు పోరాడతానని.. ముందస్తుగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ పేర్కొన్నారు. పాకిస్థాన్లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివరలో జరగాల్సి ఉండగా.. ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలాఉంటే, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 27న ఇస్లామాబాద్ పరేడ్ మైదానంలో జరిగే సభకు హాజరై ప్రజాబలాన్ని ప్రదర్శించాలంటూ పిలుపునిచ్చారు. మార్చి 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో దాని నుంచి గట్టెక్కేందుకు ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!