Imran khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత
లాహోర్లో ఇమ్రాన్ ఖాన్(imran khan) ఇంటి వద్ద రణరంగం నెలకొంది. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు రావడంతో ఆయన ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు.
లాహోర్: పాకిస్థాన్(pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇంటి వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆయన మద్దతుదారులు అడ్డుకొంటున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వగా.. ఇమ్రాన్ మద్దతుదారుల్ని చెరదగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, భాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. దీంతో లాహోర్లోని జమన్ పార్క్లో ఇమ్రాన్ నివాసం వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన వీడియో సందేశాన్ని ట్విటర్లో పోస్ట్చేశారు. తాను జైలుకు వెళ్లినా, తనను చంపేసినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
‘పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్తే ప్రజలు నిద్రపోతారని వారు భావిస్తున్నట్టున్నారు. అది తప్పని మీరు రుజువు చేయండి. ప్రజలు సజీవంగా ఉన్నారని నిరూపించండి. వీధుల్లోకి వచ్చి మీ హక్కుల కోసం పోరాడండి. ఆ భగవంతుడు ఇమ్రాన్కు అన్నీ ఇచ్చాడు. కానీ మీ యుద్ధంలో నేనూ పోరాడుతున్నా. నేను నా జీవితమంతా పోరాడా.. దాన్ని కొనసాగిస్తాను. ఒకవేళ నాకేదైనా జరిగితే.. వాళ్లు నన్ను జైలులో పెట్టొచ్చు. చంపేయొచ్చు కూడా. ఇమ్రాన్ ఖాన్ లేకపోయినా పోరాడగలమని మీరు నిరూపించాలి. ఒక వ్యక్తి చేసే బానిసత్వ పాలనను ఎప్పటికీ అంగీకరించబోమని మీరంతా నిరూపించాలి’’ అని పిలుపునిచ్చారు.
ఇమ్రాన్ ఇంటి వద్ద డీఐజీకి గాయాలు
ఇమ్రాన్ ఖాన్ను తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అధికారులు ఆయన నివాసానికి చేరుకోగా.. అప్పటికే పీటీఐ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు ఇమ్రాన్ నివాసం వద్దకు తరలివచ్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ సమయంలో పీటీఐ శ్రేణులు చేసిన దాడిలో ఇస్లామాబాద్ డీఐజీకి గాయాలయ్యాయి. ఇమ్రాన్ ఇంటివైపు వచ్చే అన్ని దారులనూ మూసివేశారు. అయితే, ఏ కేసులో ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు వచ్చారనే విషయంలో మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ పీటీఐ నేత ఫరూక్ హబీబ్ ట్వీట్చేశారు. మరో నేత ఫవాద్చౌదరి మాట్లాడుతూ.. తోషఖానా కేసులో అరెస్టు వారెంట్లు ను ఇస్లామాబాద్ కోర్టులో ఛాలెంజ్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ కేసు విచారణకు వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ చీఫ్ ఆర్గనైజర్ మరియమ్ నవాజ్ షరిఫ్ మాట్లాడుతూ.. ఈరోజు ఎవరైనా పోలీసు అధికారి/ సిబ్బంది గాయపడితే.. అందుకు ఇమ్రాన్ ఖాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇమ్రాన్ఖాన్ ప్రధానిగా ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్ హాజరుకాకపోవడంతో సెషన్సు కోర్టు ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్