Pakistan: బిలావల్ నోట మళ్లీ అవాకులు, చెవాకులు
కశ్మీర్ అంశాన్ని ఐరాస ఎజెండాలోకి తీసుకొచ్చే విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని పాకిస్థాన్ వాపోయింది. ఈ విషయంలో భారత్ అడ్డుపడుతోందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అక్కసు వెళ్లగక్కారు.
న్యూయార్క్: ఐరాస(UN) వేదికలపై పాకిస్థాన్(Pakistan) ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని(Kashmir Issue) లేవనెత్తుతుంది. సమావేశంలో చర్చిస్తున్న అంశం, ఎజెండాతో సంబంధం లేకుండా దీనిపై అనవసర వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఇదే విషయమై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto) తాజాగా భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఐరాసలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా భారత్ అడ్డుపడుతోందన్నారు. ఈ క్రమంలోనే ‘కశ్మీర్’ అంశాన్ని ఐరాస ఎజెండా(UN Agenda)లోకి తీసుకొచ్చే విషయంలో పాక్కు తీవ్ర ఒడుదొడుకులు(Uphill Task) ఎదురవుతున్నాయని వాపోయారు.
‘ఐరాస వేదికలపై కశ్మీర్ సమస్య ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా.. పొరుగు దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. ఇది వివాదాస్పద భూభాగం కాదని, ఐరాసలో చర్చించాల్సిన వివాదం కాదని చాటేందుకు యత్నిస్తాయి’ అని బిలావల్ వ్యాఖ్యానించారు. పాలస్తీనా, కశ్మీర్ పరిస్థితులను పోల్చుతూ.. ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. కశ్మీర్, పాలస్తీనాల పరిస్థితి ఒకటేనని.. ఈ రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటివరకు పరిష్కరించలేదన్నారు. భారత్ను అభివర్ణించే క్రమంలో.. మిత్ర దేశం, పొరుగు దేశం అంటూ బిలావల్ తడబాటుకు గురికావడం గమనార్హం.
జమ్మూ- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్, పాక్ల మధ్య ‘కశ్మీర్’ వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఎత్తిచూపి అంతర్జాతీయ వేదికలపై భారత్ను దోషిగా నిలబెట్టాలని పాక్ గతంలోనూ పలుమార్లు ప్రయత్నించి భంగపాటుకు గురైంది. జమ్మూ- కశ్మీర్, లద్దాఖ్లు పూర్తిగా భారత్లో అంతర్భాగమేనని, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఇదివరకే దాయాదికి గట్టిగా చెప్పింది. ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణంలో ఇస్లామాబాద్తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.