Imran Khan: నేను పారిపోను.. చివరి శ్వాస వరకు నా దేశంలోనే: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్(Pakistan)లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను దేశం విడిచిపారిపోనని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan) విపత్తు వైపు వెళ్తోందని, దేశం విచ్ఛిన్నం కావొచ్చని మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే మార్గమన్నారు. అలాగే తాను దేశం విడిచిపారిపోయే ప్రసక్తే లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.
‘పరారై లండన్లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా..? దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికేమైనా ఆలోచన ఉందా..? దేశం విపత్తు వైపు వెళ్తోంది. అందుకే ఎన్నికలు నిర్వహించి, దేశాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని అన్నారు. అలాగే ఆర్మీపై చేసిన విమర్శల గురించి స్పందించారు. ‘నేను ఆర్మీని విమర్శించడమంటే.. నా పిల్లలను మందలించినట్టే’ అని వ్యాఖ్యానించారు. తాజా సర్వేలో 70 శాతం మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు ఉన్నారని, తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్ మీర్ మాట్లాడుతూ.. లాహోర్లోని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై తమకు నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్కు హెచ్చరిక జారీచేశారు. 24 గంటల వరకు ఇమ్రాన్ ఇంటి వద్ద ఎలాంటి పోలీసు చర్య చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయి. తర్వాత తమ ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు.
ఇమ్రాన్ మద్దతుదారులకు సైన్యం హెచ్చరిక..
మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత దేశంలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీకి చెందిన భవనాలు, కార్యాలయాలపై ఇమ్రాన్ మద్దతుదారులు దాడికి దిగారు. దీనిని ఆర్మీ(Pak Army) సీరియస్గా తీసుకుంది. అమరవీరుల స్మారకాలను అగౌరవపరిచే చర్యలను ఏ మాత్రం అనుమతించమని వార్నింగ్ ఇచ్చింది. అయితే దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!