Pakistan PM: పాక్ ప్రధాని ఆడియో క్లిప్ లీక్.. అమ్మకానికి డార్క్వెబ్లో..!
పాకిస్థాన్ కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్ డార్క్ వెబ్లో 3.50లక్షల డాలర్లకు విక్రయానికి ఉన్నాయని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్ చౌధరీ బాంబుపేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఏమాత్రం సురక్షితం కాదని
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్ డార్క్ వెబ్లో 3.50లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్ చౌధరీ బాంబుపేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఏమాత్రం సురక్షితం కాదని వెల్లడించారు. పాకిస్థాన్కు సంబంధించిన కీలక నిర్ణయాలు మొత్తం లండన్ నుంచి తీసుకొంటున్నట్లు ఈ ఆడియో క్లిప్లోని సంభాషణలను బట్టి అర్థమవుతుందన్నారు. నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే ఇది లీకైందని పేర్కొన్నారు.
లీకైన సుదీర్ఘ ఆడియో క్లిప్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, న్యాయశాఖ మంత్రి ఆజమ్ తరార్, ఇంటీరియర్ శాఖ మంత్రి రాణ సనావుల్లా, నేషనల్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అయాజ్ సిద్ధీఖీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంభాషణలు ఉన్నాయి.
పాక్ ఆర్థిక మంత్రి మార్పుపై కీలక విషయాలు వెల్లడి..
ఈ ఆడియోక్లిప్ తొలి భాగంలో మరియం నవాజ్, ప్రధాని షెహబాజ్ షరీఫ్లు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిలీ గురించి మాట్లాడుకొన్నారు. పాక్లో పెట్రోల్ ధరలు పెంచాలని కొన్నాళ్ల క్రితం ఇస్మాయిలీ నిర్ణయించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని మరియం నవాజ్ తప్పుపట్టారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి సీనియర్ నేత ఇసాక్ దార్కు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు.
కానీ, తాజాగా లీకైన సంభాషణల్లో మాత్రం మరియం నవాజ్ స్వయంగా ఇంధన ధరలు పెంచాలని సూచిస్తున్నట్లు స్పష్టంగా ఉందని పీటీఐ నేత ఫవాద్ ఆరోపించారు. ఇసాక్దార్కు ఆర్థిక శాఖ ఇచ్చేందుకు కావాలని ఇస్మాయిలీపై దుష్ప్రచారం చేశారని వివరించారు.
ఈ ఆడియో లీక్ వ్యవహారంపై పాకిస్థాన్ అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనిలో అన్ని ఏజెన్సీల అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు. ప్రధాని ఇంటి భద్రతను కూడా ఈ బృందం సమీక్షిస్తుందని పాక్ ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.