Missile: భారత్కు పోటీగా పాక్ క్షిపణి ప్రయోగం.. చివరకు ఏమైందంటే..?
భారత రక్షణ శాఖకు చెందిన క్షిపణి ఒకటి ఇటీవల పొరబాటుగా పాకిస్థాన్ భూభాగంలో పడిన ఘటనతో ఇరు దేశాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. అయితే ఈ ఘటన నేపథ్యంలో
ఇంటర్నెట్డెస్క్: భారత రక్షణ శాఖకు చెందిన క్షిపణి ఒకటి ఇటీవల పొరబాటుగా పాకిస్థాన్ భూభాగంలో పడిన ఘటనతో ఇరు దేశాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. అయితే ఈ ఘటన నేపథ్యంలో దాయాది పాక్.. తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తాజాగా ఓ క్షిపణి ప్రయోగం చేపట్టగా.. అది కాస్తా విఫలమై పరువుపోయింది. ఈ మేరకు పాక్లో కొన్ని స్థానిక మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లోని జంషోరో ప్రాంతంలో గురువారం ఓ గుర్తుతెలియని వస్తువు గాల్లోకి ఎగిరి.. కింద పడటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ వస్తువు క్షిపణి అని తర్వాత తేలింది. పాక్ మీడియా కథనాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సింధ్లోని టెస్ట్ రేంజ్ నుంచి ఓ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అయితే ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంఛర్లో సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేచింది. కానీ, కొద్ది సెకన్లకే ఆ మిసైల్ తన లక్షిత మార్గం నుంచి తప్పింది. ఆ వెంటనే కుప్పకూలింది.
పాక్లోని కొన్ని మీడియా ఛానల్స్ ఈ ఘటనను ప్రసారం చేయగా.. ఇప్పటివరకు అధికారులు మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. అయితే అది క్షిపణి కాదని, సాధారణ మోర్టార్ ట్రేసర్ రౌండ్ అని స్థానిక అధికారులు కొందరు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, అది కచ్చితంగా రాకెట్ లేదా క్షిపణి అని సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టరట. ఇటీవల చోటుచేసుకున్న భారత క్షిపణి ఘటనకు ప్రతిస్పందనగానే పాక్ ఈ ప్రయోగం చేపట్టి ఉంటుందని అక్కడి మీడియా ఏజెన్సీ ఒకటి వెల్లడించింది.
ఈ నెల 9వ తేదీన భారత్లోని గుర్తుతెలియని వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ క్షిపణి గాల్లోకి లేచి పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. కానీ, పాక్ మాత్రం దీనిపై సంయుక్త దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం