Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
‘ఆసియా టైగర్’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్థాన్(Pakistan).. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic crisis)లో కూరుకుపోయిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) పేర్కొన్నారు....
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: ‘ఆసియా టైగర్’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్థాన్(Pakistan).. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic crisis)లో కూరుకుపోయిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) పేర్కొన్నారు. వ్యవస్థీకృత లోపాలే దీనికి కారణమన్నారు. పాక్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో షెహబాజ్ దేశ ఆర్థిక స్థితిగతులపై స్పందించారు. ‘1960వ దశకంలో అభివృద్ధిపరంగా ఎన్నో ఆశలు, ఆశయాలతో నిండిన పాక్.. తదుపరి ‘ఆసియా టైగర్’గా అవతరించేందుకు సిద్ధంగా ఉందని దేశం మొత్తం భావించేది. కానీ, 2022 నాటికి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అధిక ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ఆంక్షలు, ఐరోపాలో ఘర్షణ వాతావరణం వంటి సవాళ్ల నడుమ ఈ సంక్షోభం వేళ్లూనుకుంది’ అని అన్నారు.
దేశంలో అయిదు దశాబ్దాలుగా గుర్తించని బలహీనతలూ ఆర్థిక వృద్ధి కుంటుపడేందుకు కారణమయ్యాయన్నారు. ఈ సందర్భంగా మూడు వ్యవస్థీకృత లోపాలను ప్రస్తావించారు. అవి.. ఏకపక్ష రాజకీయాలు, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం, గ్లోబలైజేషన్ ఫలాలను అందిపుచ్చుకోకపోవడమని పేర్కొన్నారు. ‘పాక్ నేడు ప్రపంచంలో అత్యంత వినియోగ- ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీనికి విరుద్ధంగా.. 15 శాతం మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి. ఎగుమతులు కేవలం 10 శాతం మాత్రమే. ఒక ఏడాదిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడి సంస్థలు పాక్కే పరిమితం అవుతున్నాయి’ అని తెలిపారు. ఏ దేశం కూడా ఈ విధమైన పరిస్థితులతో అభివృద్ధి చెందదన్నారు.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడటానికే తక్షణ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ప్రాంతీయ స్థిరత్వం, క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్ సమాజాన్ని ఆధునికీకరించడం చాలా ముఖ్యమన్నారు. కీలకమైన ప్రజా సేవలకు ప్రతిఫలంగా ప్రజలు పన్నులను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. అప్పులు, అధిక ద్రవ్యోల్బణం, దిగజారుతోన్న విదేశీ మారక నిల్వలతో పాక్ ప్రస్తుతం ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నిత్యవసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని వ్యాసం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. -
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్