Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
‘ఆసియా టైగర్’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్థాన్(Pakistan).. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic crisis)లో కూరుకుపోయిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) పేర్కొన్నారు....
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: ‘ఆసియా టైగర్’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్థాన్(Pakistan).. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic crisis)లో కూరుకుపోయిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) పేర్కొన్నారు. వ్యవస్థీకృత లోపాలే దీనికి కారణమన్నారు. పాక్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో షెహబాజ్ దేశ ఆర్థిక స్థితిగతులపై స్పందించారు. ‘1960వ దశకంలో అభివృద్ధిపరంగా ఎన్నో ఆశలు, ఆశయాలతో నిండిన పాక్.. తదుపరి ‘ఆసియా టైగర్’గా అవతరించేందుకు సిద్ధంగా ఉందని దేశం మొత్తం భావించేది. కానీ, 2022 నాటికి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అధిక ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ఆంక్షలు, ఐరోపాలో ఘర్షణ వాతావరణం వంటి సవాళ్ల నడుమ ఈ సంక్షోభం వేళ్లూనుకుంది’ అని అన్నారు.
దేశంలో అయిదు దశాబ్దాలుగా గుర్తించని బలహీనతలూ ఆర్థిక వృద్ధి కుంటుపడేందుకు కారణమయ్యాయన్నారు. ఈ సందర్భంగా మూడు వ్యవస్థీకృత లోపాలను ప్రస్తావించారు. అవి.. ఏకపక్ష రాజకీయాలు, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం, గ్లోబలైజేషన్ ఫలాలను అందిపుచ్చుకోకపోవడమని పేర్కొన్నారు. ‘పాక్ నేడు ప్రపంచంలో అత్యంత వినియోగ- ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీనికి విరుద్ధంగా.. 15 శాతం మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి. ఎగుమతులు కేవలం 10 శాతం మాత్రమే. ఒక ఏడాదిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడి సంస్థలు పాక్కే పరిమితం అవుతున్నాయి’ అని తెలిపారు. ఏ దేశం కూడా ఈ విధమైన పరిస్థితులతో అభివృద్ధి చెందదన్నారు.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడటానికే తక్షణ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ప్రాంతీయ స్థిరత్వం, క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్ సమాజాన్ని ఆధునికీకరించడం చాలా ముఖ్యమన్నారు. కీలకమైన ప్రజా సేవలకు ప్రతిఫలంగా ప్రజలు పన్నులను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. అప్పులు, అధిక ద్రవ్యోల్బణం, దిగజారుతోన్న విదేశీ మారక నిల్వలతో పాక్ ప్రస్తుతం ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నిత్యవసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని వ్యాసం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు