Imran Khan: మోదీతో చర్చలు జరపాలనుకుంటున్నా! పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్
ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ చర్చలు జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ..
ఇంటర్నెట్ డెస్క్: ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ చర్చలు జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. రెండు రోజుల రష్యా పర్యటనకు ముందు.. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఈ మేరకు మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించగలిగితే భారత ఉపఖండంలోని కోట్లాది జనాభాకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉగ్రవాదం, కశ్మీర్ ఇతరత్రా సమస్యల కారణంగా.. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పాక్ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తే.. చర్చలు జరుపుతామని భారత్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి సాగలేవనీ తేల్చిచెప్పింది.
. అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం తమ ప్రభుత్వ విధానమని.. అయితే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో.. వాణిజ్యం కూడా తగ్గిపోయిందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ.. ‘ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు. పాక్కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. ఆర్థిక సహకారంపై చర్చల కోసం రష్యా పర్యటనకు వెళ్లనున్న ఇమ్రాన్.. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక పాకిస్తానీ నాయకుడు రష్యాకు వెళ్తుండటం ఇదే మొదటిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!