Imran Khan: గిఫ్ట్గా వచ్చిన నెక్లెస్ రూ.18కోట్లకు విక్రయం.. ఇమ్రాన్ఖాన్పై ఎఫ్ఐఏ దర్యాప్తు!
పాకిస్థాన్ ప్రధానిగా పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది! ప్రధానిగా ఉన్న సమయంలో తనకు కానుకగా వచ్చిన ......
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానిగా పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది! ప్రధానిగా ఉన్న సమయంలో తనకు కానుకగా వచ్చిన ఖరీదైన నెక్లెస్ను ఆ దేశ కోశాగారంలో భద్రపరచడానికి బదులు ఓ నగల వ్యాపారికి రూ.18 కోట్లకు విక్రయించారన్న ఆరోపణలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రధానిగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ బహుమతిగా అందుకున్న ఖరీదైన నెక్లెస్ను కోశాగారానికి (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపకుండా.. తన మాజీ ప్రత్యేక సహాయకుడైన జుల్ఫికర్ బుఖారీకి ఇవ్వగా.. అతడు దాన్ని లాహోర్లోని ఓ నగల వ్యాపారికి రూ.18 కోట్లకు విక్రయించినట్టు ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించినట్టు తెలిపింది. అధికారంలో ఉన్నప్పుడు వచ్చే కానుకలకు సగం ధర చెల్లించి ఆయా నేతలు తమ వ్యక్తిగత గదుల్లో ఉంచుకోవచ్చు. కానీ, ఇమ్రాన్ ఖాన్ కొన్ని లక్షలు మాత్రమే జాతీయ ఖజానాలో జమచేశారనీ.. అది చట్టవిరుద్ధమంటూ కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ చట్టం ప్రకారం ప్రముఖుల నుంచి స్వీకరించే కానుకలు స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీలో భద్రపరచాలి.. ఒకవేళ తిరిగి ఆ కానుకల్ని సమర్పించలేకపోయినా.. సగం ధరైనా చెల్లించకపోయినా చట్టవిరుద్ధ చర్యగా పరిగణిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్