Passport: పాస్పోర్టులో పూర్తి పేరు లేకపోతే.. ఆ దేశంలోకి నో ఎంట్రీ..!
టూరిస్టు లేదా మరే ఇతర రకాల వీసాదారులైనా పాస్పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని అనుమతించబోమని యూఈఏ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పాస్పోర్టుపై పూర్తి పేరు లేకుండా కేవలం ఒక పదంతో మాత్రమే పేరు ఉండేవారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చిందట. దీనిపై తాజాగా ఎయిరిండియా, ఇండిగో వంటి భారత ఎయిర్లైన్లు ప్రయాణికులకు సమాచారమిచ్చాయి.
‘‘యూఈఏ అధికారుల సూచనల ప్రకారం.. టూరిస్టు లేదా ఇతర రకాల వీసాదారులైనా పాస్పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని యూఏఈలోకి అనుమతించట్లేదు’’ అని భారత ఎయిర్లైన్లు వేర్వేర్లు ప్రకటనల్లో వెల్లడించాయి. పాస్పోర్టుపై ఒకే పదంతో పేరు ఉండే వారికి యూఏఈ వీసాలు జారీ చేయట్లేదు. ఒకవేళ అలాంటి పాస్పోర్టుదారులకు ఇప్పటికే వీసా జారీచేసినప్పటికీ.. అరబ్ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం అనుమతించట్లేదని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.
అయితే ఈ కొత్త నిబంధన విజిట్ వీసా, వీసా ఆన్ అరైవల్, ఉపాధి వీసా, తాత్కాలిక వీసాదారులకు వర్తిస్తుందట. యూఏఈలో శాశ్వత లేదా నివాస హోదా ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదని ఎయిర్లైన్లు వెల్లడించాయి. శాశ్వత/నివాస హోదా ఉన్నవారికి పాస్పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “first name” లేదా “surname’’ కాలమ్లో అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నిబంధన గురించి పలు భారత ఎయిర్లైన్లు ఇప్పటికే ప్రయాణికులకు సమాచారమిచ్చాయి. అయితే దీనిపై యూఏఈ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.