Nancy Pelosi: : డ్రాగన్ ‘ఫైనల్ వార్నింగ్’లను లెక్కచేయని ఉక్కు మహిళ..!
‘‘అమెరికా శిఖరం నుంచి కుప్పకూలకుండా ఆపేందుకు ఇదే ‘తుది హెచ్చరిక’ అని నిపుణులు చెబుతున్నారు’’ అంటూ నాన్సీ పెలోసీ పర్యటనపై గ్లోబల్ టైమ్స్ నిన్న ఓ వ్యాసం రాసింది.
ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న పెలోసీ పర్యటన
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘‘శిఖరం నుంచి అమెరికా కుప్పకూలకుండా ఆపేందుకు ఇదే ‘తుది హెచ్చరిక’ అని నిపుణులు చెబుతున్నారు’’ అంటూ నాన్సీ పెలోసీ పర్యటనపై గ్లోబల్ టైమ్స్ నిన్న ఓ వ్యాసం రాసింది. వాస్తవానికి ‘చైనా ఫైనల్ వార్నింగ్’ అంటేనే అమెరికాకు ఇప్పటికీ ఓ పెద్ద జోక్. అటువంటి వాటిని పెలోసీ తేలిగ్గా తీసుకొన్నారు. షీజిన్పింగ్ గాండ్రింపులను.. బైడెన్ గొణుగుడును పట్టించుకోకుండా తైవాన్ చేరుకొన్నారు. పెలోసీ మొండిఘటమని తెలిసిన అమెరికా సైన్యం ఆద్యంతం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తాజాగా తైవాన్ అధినేత త్సాయి యింగ్ వెన్తో భేటీ అయ్యారు. మరోపక్క చైనా యుద్ధవిన్యాసాలు మొదలుపెట్టి బెదిరించే యత్నాలు చేస్తోంది.
మలేషియా నుంచి భిన్నమైన మార్గంలో..
మలేషియా పర్యటన ముగించుకొన్న వెంటనే ఆమె విమానం స్పార్-19 కౌలాలంపూర్ ఎయిర్పోర్టు నుంచి గాల్లోకి ఎగిరింది. ఈ విమానం కదలికలను దాదాపు 7,08,000 మంది ట్రాక్ చేసినట్లు ఫ్లైట్ రాడార్24 వెల్లడించింది. తమ వెబ్సైట్లో అత్యధిక మంది ట్రాక్ చేసిన విమానం ఇదే అని తెలిపింది. ఒక దశలో ఈ వెబ్సైట్ ట్రాఫిక్ను తట్టుకోలేకపోయింది. మరో వైపు స్పార్-19 విమానం బ్రూనై మీదుగా ఫిలిప్పీన్స్ సముద్రంపై నుంచి తైపే వైపు దూసుకెళ్లింది. తైవాన్ మలుపు తీసుకొని తైపే దిశగా వెళ్లింది. వాస్తవానికి కౌలాలంపూర్ నుంచి దక్షిణ చైనా సముద్రం మీదుగా తైవాన్ వెళ్లవచ్చు. కానీ, అక్కడ చైనా కృత్రిమ ద్వీపాలు ఉండటంతో.. ఆ మార్గాన్ని తప్పించి ఫిలిప్పీన్స్ సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు.
చైనా రంకెలు కొత్తేమీ కాదు..
‘చైనా ఫైనల్ వార్నింగ్’లు రావడం అమెరికాకు ఇదేం కొత్తకాదు. 1950లు, 1960ల్లో తైవాన్ జలసంధి విషయంలో అమెరికా-చైనాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో నిత్యం అమెరికా మిలిటరీ జెట్లు ఇక్కడ చక్కర్లు కొట్టేవి. చైనా దీనికి నిరసనలు తెలిపేది. ఆ క్రమంలో 1964 నాటికి దాదాపు దౌత్య మార్గాల్లో 900ల సార్లకుపైగా ‘చైనా ఫైనల్ వార్నింగ్’లు జారీ చేసింది. ఇవి ప్రసార మాధ్యమాల్లో రావడం నిత్యకృత్యంగా మారిపోయింది. చివరికి ఇదో ఊతపదంలా మారిపోయింది. చైనా చుట్టుపక్కల యూఎస్ఎస్ఆర్ మాజీ దేశాల్లో ఈ ఊతపదం ప్రచారంలో ఉంది. ముఖ్యంగా బాల్టిక్ దేశమైన ఎస్తోనియాలో ఇది బాగా వాడుకలో ఉంది. ఇటీవల చైనా ‘నిప్పుతో చెలగాటం’ పదాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే చైనా అధికారులు సహా.. షీజిన్పింగ్ కూడా ఈ పదాన్ని చాలా సార్లు వాడారు. అయినా నాన్సీ పెలోసి తైవాన్కు వెళ్లారు.
మేము తైవాన్ను వదిలేయలేదు..
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అధ్యక్ష భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘‘నిస్సందేహంగా ఓ విషయం స్పష్టంగా చెబుతున్నాను. అమెరికా హామీల నుంచి వైదొలగి తైవాన్ను వదిలేయలేదు. మా రెండు దేశాల మధ్య స్నేహానికి గర్విస్తున్నాం. అమెరికా మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. దానిని తీసుకొనే నేను వచ్చాను’’ అని పేరొన్నారు.
అంతకు ముందు తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెలన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని నాన్సీపెలోసీకి అందజేశారు. అసలే పెలోసీ పర్యటనపై చైనా మండిపడుతుంటే.. మరో పక్క తన పర్యటనలో తియానెన్మెన్ స్క్వేర్ ఘటన ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘నేను తైవాన్ మిత్రురాలినని మీరు అన్నారు. దానిని కాంప్లిమెంట్గా స్వీకరిస్తున్నా. తైవాన్కు బలమైన మద్దతు ఉంది. భవిష్యత్తులో ఇరు దేశాల చట్టసభల మధ్య సమన్వయం పెంచడమే నా పర్యటన ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత సమాజాల్లో తైవాన్ ఒకటి. ఒక్కనిమిషం తియానెన్మెన్ స్క్వేర్పై మాట్లాడదాం. అప్పట్లో రెండు పార్టీల(అమెరికాలో) మద్దతు లభించింది. అది 30 ఏళ్ల క్రితం మాట’’ అని పేర్కొన్నారు.
చైనా సైనిక విన్యాసాలు..
పెలోసీ పర్యటన నేపథ్యంలో చైనా లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్ను ప్రారంభించింది. తైవాన్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. వీటిల్లో దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించడం వంటి వాటిని కూడా నిర్వహిస్తామని వెల్లడించింది. తైవాన్ తీర ప్రాంతానికి కేవలం 12.4 మైళ్ల దూరంలో వీటిని నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. నిన్న మొత్తం 21 చైనా ఫైటర్ జెట్ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చొరబడ్డాయి.
తైవాన్పై బీజింగ్ ఆంక్షలు..
పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా చైనా తైవాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటించింది. చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ పలు ఆంక్షలను ప్రకటించింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతిని నిషేధించింది. వాటిల్లో అధిక పురుగు మందులు ఉన్నాయని ఆరోపించింది. ఇక శీతలీకరించిన చేపల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. దీంతోపాటు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఇసుకపై కూడా నిషేధం విధించింది.
తైవాన్ను శిక్షించడానికి దాని వ్యవసాయ రంగాన్ని చైనా లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలుస్తోంది. తైవాన్లోని దక్షిణ ప్రాంతంలో పండ్లతోటలను నిర్వహించే చాలా కుటుంబాల్లో త్సాయి యింగ్ వెన్కు భారీ మద్దతు ఉంది. తైవాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏటా ఈ రెండు దేశాల వాణిజ్యం పెరిగి 328 బిలియన్ డాలర్లకు చేరింది. దీనిలో తైవాన్కు వాణిజ్య మిగులు ఎక్కువగా ఉంటోంది. దానిపైనే ఇప్పుడు చైనా గురి పెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ