Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
అమెరికా అణ్వాయుధ కేంద్రాలపై నిఘా కోసం చైనా వదిలిన బెలూన్ను గుర్తించారు. దీంతో అమెరికా దీనిని కూల్చేందుకు యుద్ధ విమానాలను సిద్ధం చేసింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలోని అణు స్థావరంపై చైనా వదిలిన ఓ భారీ హై ఆల్టిట్యూడ్ బెలూన్ను గుర్తించారు. ఈ విషయాన్ని పెంటగాన్ స్వయంగా వెల్లడించింది. ఈ బెలూన్ను అమెరికా నిఘా వర్గాలు కొంతకాలంగా ట్రాక్ చేస్తున్నాయి. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే పైన ఇది ప్రయాణిస్తోందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ పేర్కొన్నారు. అది ఉత్తర అమెరికా గగనతలంలో ప్రయాణిస్తోంది. దీనిని కూల్చేస్తే శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్ అధికారులు.. అధ్యక్షుడు జో బైడెన్కు సూచించారు. దీంతో పాటు తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. ప్రస్తుతం ఈ బెలూన్ అమెరికాలోని చాలా కీలక ప్రదేశాల మీదుగా ఎగురుతోందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా పెద్దగా ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కాకపోవచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అణు బొరియలపై నిఘా..
బుధవారం ఈ బెలూన్ను మోంటానాపై గుర్తించారు. ఇది కెనడాను దాటుకొని అలాస్కా గగనతలంపై ఎగురుతోంది. శ్వేత సౌధం నుంచి ఆదేశాలు రాగానే దీనిని కూల్చివేసేందుకు ఇప్పటికే ఎఫ్-22 సహా ఇతర ఫైట్ జెట్లను సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో మోంటానా కూడా ఒకటి. అమెరికాలో ఉన్న మూడు భూగర్భ అణు క్షిపణి స్థావరాల్లో ఒకటి ఇక్కడే మాల్మ్స్ట్రోమ్ వైమానిక స్థావరం వద్ద ఉంది. ఈ నిఘా బెలూన్ దానిపై నుంచి ఎగిరి ఉంటుందని తాము భావిస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ బెలూన్ విషయాన్ని అమెరికా అధికారులు వాషింగ్టన్ డీసీలోని చైనా దౌత్య సిబ్బందికి తెలిపారు. ప్రస్తుతం బెలూన్ లొకేషన్ను పెంటాగాన్ గోప్యంగా ఉంచింది. గతంలో కూడా ఇలా బెలూన్లతో నిఘా సమాచారం సేకరించిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఈ సారి మాత్రం ఈ బెలూన్ చాలా కాలం పాటు అమెరికా గగనతలంలోనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.