Ukraine Crisis: రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తాం.. లాభాలను ఉక్రెయిన్కు ఇస్తాం: ఫైజర్
రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ వెల్లడించింది......
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంలో కొత్తగా క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించబోమని, కొనసాగుతున్న అధ్యయనాల కోసం రోగులను నియమించుకోవడం మానుకుంటామని స్పష్టం చేసింది. రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కానీ మానవాతా దృక్పథంతో వ్యవహరిస్తామని పేర్కొంటూ.. ఆ దేశానికి ఔషధాల సరఫరా కొనసాగిస్తామని వెల్లడించింది. దీంతో పాటు అక్కడి యూనిట్ నుంచి వచ్చే లాభాలన్నింటినీ ఉక్రెయిన్ ప్రజల సాయం కోసం విరాళంగా ఇస్తామని తెలిపింది. అక్కడ కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ను ఆ దేశం వెలుపల నిర్వహించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రెగ్యులేటర్ సంస్థలతో కలిసి పని చేస్తామని ఫైజర్ తెలిపింది.
ఉక్రెయిన్పై పోరు నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. పుతిన్ సర్కారుపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికా శుక్రవారం మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిను తగ్గించాలని నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా