Modi at G20: ‘నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభం!’
ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థలు స్థిరంగా కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లేనిపక్షంలో.. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. జీ-20 సదస్సులో భాగంగా ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు.
బాలి: ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థలు స్థిరంగా కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. లేనిపక్షంలో.. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. జీ-20 సదస్సు(G20 Summit)లో భాగంగా ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు ధాన్యాల ఎగుమతులు చేపడుతూనే.. భారతీయులందరికీ ఆహార భద్రత(Food Security)ను కల్పించామంటూ ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ప్రధాని వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
‘ఆహార భద్రతను కల్పించే విషయంలో ఎరువుల కొరత కూడా పెద్ద సమస్యే. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. ఎరువులు, ధాన్యాల సరఫరా వ్యవస్థ స్థిరంగా కొనసాగేలా.. మనమంతా పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. భారత్లోనూ సుస్థిర ఆహార భద్రత కోసం.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. మినుములు వంటి పోషక, సంప్రదాయ ఆహార ధాన్యాలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు, పోషకాహార లోపాలను తృణధాన్యాలు పరిష్కరించగలవని ప్రధాని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా.. ప్రపంచ వృద్ధికి భారత్లో ఇంధన భద్రత కూడా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇంధన సరఫరాలపై ఎటువంటి ఆంక్షలను ప్రోత్సహించకూడదు. ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని నెలకొల్పాలి. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు