మోదీకి ఫిజీ అత్యున్నత పురస్కారం.. గినియాలో అరుదైన గౌరవం
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi) పసిఫిక్ దేశాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందారు. ఫిజీ, పపువా న్యూ గినియా తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి.
పోర్ట్ మోరెస్బీ: పసిఫిక్ దేశమైన పపువా న్యూ గినియా(Papua New Guinea) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi)కి అపూర్వ ఆదరణ లభించింది. పపువా న్యూ గినియా, ఫిజీ నుంచి అత్యున్నత పురస్కారాలను పొందారు. ఫిజీ(Fiji) తన దేశ అత్యున్నత పౌర పురస్కారం(Fiji's Highest Civilian Honour) ‘ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ఇచ్చి సత్కరించింది. ఆయన గ్లోబల్ లీడర్షిప్కు గుర్తుగా దీనిని అందజేసింది. ఆ తర్వాత గినియా నుంచి అరుదైన గౌరవాన్ని పొందారు.
పపువా న్యూ గినియా(Papua New Guinea)లో పర్యటించిన మోదీ.. సోమవారం ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా.. మోదీకి పౌర పురస్కారాన్ని అందించారు. ఇప్పటివరకు ఫిజీయేతరులైన అతికొద్ది మందికి మాత్రమే దీనిని అందుకొన్నారు. అనంతరం గినియా ప్రభుత్వం.. ‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు’ను ఇచ్చి గౌరవించింది.
గతంలో పలుదేశాలు మోదీకి అత్యున్నత పురస్కారాలను అందించాయి. అంతర్జాతీయ వేదికపై మోదీ నాయకత్వంతో భారత్కు పెరుగుతోన్న ప్రాబల్యం, ఇతర దేశాలతో మెరుగవుతున్న సంబంధాలకు గుర్తుగా ఈ గౌరవాలు దక్కుతున్నాయి.
మరోసారి ఆ బ్లూ జాకెట్ ధరించిన మోదీ..
వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలపై చూపిస్తోన్న పెను ప్రభావం విషయంలో అందరినీ చైతన్యం చేసేందుకు ప్రధాని మోదీ ముందుంటారు. దానిలో భాగంగా ఆయన పర్యావరణ హితమైన నీలం రంగు జాకెట్లో కన్పించారు. గినియాలో తొలిసారి పర్యటించిన ఆయన రోజు మొత్తం ఈ వస్త్రధారణలోనే ఉన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి దానిని తయారు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బహూకరించిన ఈ జాకెట్ను ధరించి ఇంతకుముందు మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్