Zelensky: అణు భయాలు నెలకొన్న వేళ.. జెలెన్స్కీకి మోదీ ఫోన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ ప్రతిష్టంభనకు సైనిక చర్య పరిష్కారం కాదని ఉద్ఘాటించిన మోదీ.. అణు కేంద్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin).. అణ్వాయుధాల ప్రయోగం జరపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky)కి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ ప్రతిష్టంభనకు సైనిక చర్య పరిష్కారం కాదని ఉద్ఘాటించిన ప్రధాని.. అణు కేంద్రాల(Nuclear facilities) భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలో ప్రమాదం.. విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు.
ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శత్రుత్వాలను త్వరగా వీడాలని సూచించారు. చర్చలు, దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. యూఎన్ ఛార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన ప్రాధాన్యాన్ని కూడా చాటారు.
ఉక్రెయిన్తోసహా ప్రపంచంలోని అణు కేంద్రాల భద్రతకు భారత్ ఇస్తున్న ప్రాముఖ్యాన్ని మోదీ నొక్కిచెప్పారు. అణు కేంద్రాల ప్రమాదం.. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికి విపత్కర పరిణామాలు కలిగిస్తుందని తెలిపారు. 2021 నవంబరులో గ్లాస్గోలో ఇరు నేతలు చివరిసారి సమావేశం అయినప్పుడు చర్చలోకి వచ్చిన ద్వైపాక్షిక అంశాలనూ ఈ సందర్భంగా ప్రస్తావించుకున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’