PM Modi: ఐరాస ఉన్నది ఎందుకు..? జీ-7 వేదికపై మోదీ ప్రశ్న
శతాబ్దం కింద ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టడం లేదని.. అందుకే ఐరాసలో (United Nations) సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ (Narendra Modi) ఉద్ఘాటించారు.
హిరోషిమా: ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ఐరాసలో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జపాన్ హిరోషిమాలో జరిగిన జీ-7 సదస్సులో (G7 Summit) మాట్లాడిన మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, స్థిరత్వానికి సంబంధించిన సవాళ్లపై చర్చించేందుకే ఐరాస (United Nations) ఏర్పడినప్పటికీ వివిధ వేదికలపై వీటిని ఎందుకు చర్చించాల్సి వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలను భిన్న వేదికలపై ఎందుకు చర్చించాలి? ఐరాస ఉన్నది ఎందుకు? శాంతి స్థాపన ఉద్దేశంతో ఏర్పడిన ఈ వేదిక ఘర్షణలను ఎందుకు విజయవంతంగా నిరోధించలేకపోతోంది? ‘కనీసం ఉగ్రవాదం అనే పదానికి నిర్వచనాన్ని కూడా ఐరాసలో ఆమోదించలేకపోతున్నారు. ఎందుకు..? ప్రతిఒక్కరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వందేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థలు 21వ శతాబ్దానికి అనుగుణంగా లేవనే విషయం తెలుస్తోంది. ప్రస్తుత వాస్తవికతకు అవి అద్దం పట్టడం లేదు. అందుకే ఐరాస వంటి సంస్థల్లో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి సంస్థల్లో దక్షిణాది ప్రాంతాల (Global South) గళం కూడా ఉండాలి. లేదంటే, ఘర్షణలకు ముగింపు పలకాలని మాత్రమే మాట్లాడగలం. దీంతో ఐరాసతోపాటు భద్రతా మండలి కూడా కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయి’ అని భారత ప్రధాని స్పష్టం చేశారు.
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని భారత్ ఎప్పటినుంచో డిమాండు చేస్తోంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ వేదికల్లోనూ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అమెరికాలు మాత్రమే శాశ్వత దేశాలు. ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని కూడా తమ వీటో అధికారంతో అడ్డుకోగలవు. యూఎన్ఎస్సీలో 10 తాత్కాలిక దేశాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాటి కాలపరిమితి కూడా కేవలం రెండేళ్లు మాత్రమే. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు