Modi-biden meet: ఆ ఇద్దరితోనూ చాలాసార్లు మాట్లాడా: బైడెన్తో ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వర్చువల్ భేటీ జరిగింది. ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై .....
దిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వర్చువల్ భేటీ జరిగింది. ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై ఇరు దేశాధినేతలూ చర్చించారు. ఉక్రెయిన్లో పరిస్థితులపై ఇరువురూ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశిస్తున్నామన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించానన్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే తాను చాలాసార్లు మాట్లాడానని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించాలని ఇద్దరికీ విజ్ఞప్తి చేసినట్టు బైడెన్కు వివరించారు.
ఉక్రెయిన్కు ఔషధాలు, ఇరత సహాయ సామగ్రిని అందజేయడంతో పాటు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితిపై భారత పార్లమెంట్లోనూ చర్చించిన విషయాన్ని బైడెన్ దృష్టికి మోదీ తీసుకెళ్లారు. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలన్న మోదీ.. ఇరు దేశాలూ సహజ భాగస్వాములేనన్నారు. బుచాలో అమాయక పౌరుల్ని చంపినట్టు వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, తక్షణమే భారత్ ఆ దాడుల్ని ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఘటనపై న్యాయమైన విచారణకు సైతం డిమాండ్ చేసిందన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న చర్చలు శాంతికి మార్గాన్ని సుగమం చేస్తాయని ఆశిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
రష్యా భీకర దాడుల్లో ఘోరంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ మానవతా సాయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ఈరోజు చర్చల కోసం తాను ఎదురుచూసినట్టు తెలిపారు. ఇరు దేశాల బంధం మరింత లోతుగా, పటిష్ఠంగా కొనసాగేలా నిరంతరం సంప్రదింపులు, సంభాషణలు కీలకమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా క్రూరమైన యుద్ధ పరిణామాలను పరిశీలించడంతో పాటు ప్రపంచ ఆహార, వస్తు సరఫరాపై పడే ప్రభావాన్ని తగ్గించేలా ఇరు దేశాలూ సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగిస్తాయని బైడెన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!