Pakistan: పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతా: పీఎం షెహబాజ్ షరీఫ్
పాక్(Pakistan)లో ఉగ్రవాదాన్ని అణచివేస్తానని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇమ్రాన్ నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ (Pakistan) నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ప్రకటించారు. పాక్(Pakistan)లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోయిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్(Pakistan)లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం పెరుగుతోందని.. అతి త్వరలోనే దానిని పూర్తిగా అణచివేస్తామని షెహబాజ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా దళాలు కలిసి పనిచేసి దానిని నిర్మూలిస్తాయన్నారు. దేశంలో ఉగ్రవాదం పరిస్థితిపై షరీఫ్ త్వరలో నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్కు పిలుపునిచ్చారు. బన్ను దాడి ఘటనతో తన హృదయం బద్దలైందన్నారు. ఈ కాంపౌండులోకి చొరబడిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై షరీఫ్ మాట్లాడుతూ ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని బయటపడేయాలని ఫెడరల్ ప్రభుత్వం కృత నిశ్చయింతో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపెక్లో భాగంగా నిర్మించిన 50 కిలోమీటర్ల రోడ్డును , చష్మా హైడల్ పవర్ ప్రాజెక్టు వంటి వాటిని ప్రారంభించారు.
ఇమ్రాన్ తీవ్ర విమర్శలు..
మరోవైపు షరీఫ్ ప్రభుత్వంపై పీటీఐ అధినేత ఇమ్రాన్ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించిందన్నారు. లాహోర్లోని జమాన్ పార్క్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తన హయాంలో దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా మార్చినట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఏప్రిల్ నాటి నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదం 52శాతం పెరిగిందనిన్నారు. అక్కడ జరిగిన ఘటనల్లో 270 మంది చనిపోగా.. 550 మంది గాయపడినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM