Imran Khan: ఇమ్రాన్ఖాన్పై కేసు నమోదు.. ఎందుకంటే..?
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సహా మరో 150 మందిపై ఆ దేశంలోని పంజాబ్ (Punjab) రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.....
లాహోర్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సహా మరో 150 మందిపై ఆ దేశంలోని పంజాబ్ (Punjab) రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల సౌదీ అరేబియాకు వెళ్లిన ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) బృందంపై అక్కడ కొంతమంది అనుచిత నినాదాలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిలో చాలా మంది ఇమ్రాన్ మద్దతుదారులు ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినట్లు ప్రస్తావించారు.
ఇమ్రాన్ మద్దతుదారులు షెహబాజ్ను ఉద్దేశించి ‘దొంగ’, ‘దేశద్రోహి’ అని నినదించినట్లు వీడియోలో ఉందన్నది ప్రధాన ఆరోపణ. కొంత మంది ప్రధాని బృందంపై అసభ్యపదజాలం కూడా ఉపయోగించినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఇమ్రాన్తో పాటు ఆయన కేబినెట్లో మంత్రులుగా చేసిన ఫవాద్ చౌదరి, షేక్ రషీద్, జాతీయ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ సహా లండన్లోని ఇమ్రాన్ సన్నిహితులు అనిల్ ముసారత్, సాహిబ్జాదా జహంగీర్లను కూడా ఎఫ్ఐఆర్ఈలో చేర్చారు. సౌదీలో (Saudi Arabia)ని మదీనాలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానిక పోలీసులు నినాదాలు చేస్తున్న ఐదుగురు పాకిస్థానీలను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
లాహోర్కి 180 కి.మీ దూరంలో ఉన్న ఫైసలాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత నినాదాలతో పవిత్ర మదీనా ప్రాంతాన్ని అపవిత్రం చేశారంటూ స్థానిక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 100 మంది మద్దతుదారులను ఇమ్రాన్ (Imran Khan) సౌదీకి పంపించి నినాదాలు చేయించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు