America: ‘మెంఫిస్’ ఘటన ఎఫెక్ట్.. పోలీసు ప్రత్యేక విభాగం రద్దు!
అమెరికాలో టైర్ నికోల్స్ ఘటనపై పెద్దఎత్తున నిరసనలు వస్తుండటంతో మెంఫిస్ నగర పోలీసు విభాగం స్పందించింది. అతనిపై దాడికి పాల్పడిన పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం ‘స్కార్పియన్’ను రద్దు చేసింది.
వాషింగ్టన్: అమెరికాలోని మెంఫిస్ నగరంలో టైర్ నికోల్స్(Tyre Nichols) అనే యువకుడిపై పోలీసుల అమానుష దాడి ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. దీంతో ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. మెంఫిస్(Memphis) నగరం స్తంభించిపోయింది. ఈ పరిణామాల నడుమ మెంఫిస్ పోలీస్ విభాగం తాజాగా స్కార్పియన్ (స్ట్రీట్ క్రైమ్స్ ఆపరేషన్ టు రీస్టోర్ పీస్ ఇన్ అవర్ నైబర్హుడ్స్) అనే స్పెషల్ యూనిట్ను రద్దు చేసింది. నికోల్స్ ఘటనకు సంబంధించి స్కార్పియన్(Scorpion) విభాగానికే చెందిన ఐదుగురు పోలీసులపై సెకండ్ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.
‘కొంతమంది హేయమైన చర్యలు స్కార్పియన్కు చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా మెంఫిస్ పోలీసు విభాగం చర్యలు తీసుకోవడం అవసరం. ప్రజాహితం దృష్ట్యా ఈ యూనిట్ను శాశ్వతంగా రద్దు చేస్తున్నాం’ అని పోలీసు డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. నికోలస్ కుటుంబం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదిలా ఉండగా.. కారు దొంగతనాలు, ముఠా సంబంధిత నేరాల వంటి ఘటనపై దృష్టి సారించేందుకు 2021 అక్టోబరులో స్కార్పియన్ యూనిట్ ప్రారంభమైంది. 50 మంది పోలీసులతో కూడిన ఈ బృందం.. ప్రత్యేక ప్రాంతాల్లో నేరాలను తగ్గించేందుకు పని చేసింది. నికోల్స్ ఘటన నేపథ్యంలో తాజాగా రద్దయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా