Ukraine Crisis: శ్మశానంలా మారుతున్న మేరియుపోల్
అందమైన ఈ తీర నగరంలో ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. బాంబుల కుంభవృష్టిలో భవనాలన్నీ
ఆహారం, నీరు లేక అల్లాడుతోన్న లక్ష మంది
ఇంటర్నెట్డెస్క్: అందమైన ఈ తీర నగరంలో ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. బాంబుల కుంభవృష్టిలో భవనాలన్నీ మాడిమాసైపోయాయి. రష్యా దాడిలో అల్లకల్లోలంగా మారిన పోర్ట్ నగరం మేరియుపోల్లో ప్రస్తుత పరిస్థితులివి. ఈ నగరంలో ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయేందుకు నిరాకరించడంతో రష్యా తమ దాడుల్ని తీవ్రతరం చేసింది. దీంతో నగరం శ్మశానంలా మారుతోందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఆహారం, నీరు లేక లక్ష మంది అల్లాడిపోతున్నట్లు తెలిపారు.
అజోవ్ సముద్ర తీరంలో ఉండే మేరియుపోల్ నగరంలో రష్యా యుద్ధానికి ముందు 4,30,000 మంది నివాసముండేవారు. దాడుల మొదలైన తర్వాత కొందరు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. మరికొందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇంకా దాదాపు లక్ష మంది నగరంలోనే చిక్కుకుపోయారు. నిత్యం బాంబుల మోతతో బయటకు రాలేక వీరంతా ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత మూడు వారాలుగా మేరియుపోల్లో బాంబుల జడివాన కురుస్తోందని, దాదాపు ఏ భవనమూ అక్కడ మిగల్లేదని ఆ నగరం నుంచి బయటపడ్డ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మేరియుపోల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేసేందుకు వెళ్తోన్న సహాయక సిబ్బందిని రష్యా బలగాలు నిలిపివేశాయి. ఈ నగరానికి మందులు, ఆహారంతో వెళ్లిన కాన్వాయ్ను కూడా రష్యా బలగాలు అడ్డుకుని అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. మేరియుపోల్లో చిక్కుకున్న పౌరుల పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం ఆహరం, నీరు కూడా లేని పరిస్థితిలో అనేక మంది చిన్నారులు డీహైడ్రేషన్తో చనిపోతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు.
చెర్నోబిల్ ల్యాబ్ ధ్వంసం..
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా సేనలు ఇప్పటికే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడి కొత్త లాబోరేటరీని రష్యా బలగాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. రేడియోయాక్టివ్ వ్యర్థాలను నిర్వహించేందుకు కొత్తగా నిర్మించిన ఈ ల్యాబ్ను రష్యా ధ్వంసం చేసింది. యూరోపియన్ కమిషన్ సహకారంతో 6 మిలియన్ యూరోలతో నిర్మించిన ఈ ల్యాబ్ను 2015లోనే ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!