COP27: పర్యావరణ పరిరక్షణపై చర్చలు.. వచ్చిందేమో ప్రైవేట్ జెట్స్లో..!
శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే వరదలు, గాడ్పులు, కరువు తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న వాతావరణ సవాళ్లను అధిగమించే నిమిత్తం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-27 సదస్సు జరుగుతోంది. ఐరాస ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 200 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు, వాణిజ్యవేత్తలు,అనేకమంది దేశాధినేతలు పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇప్పటివరకూ చేసిన తీర్మానాలు.. వాటి అమలు తీరును వీరంతా సమీక్షించి.. కొత్త దిశదశను ప్రపంచానికి నిర్దేశిస్తారు. ఈ బృహత్తర బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న పలువురు ప్రముఖులు వ్యక్తిగత విమానాల్లో(ప్రైవేట్ జెట్స్) సదస్సుకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఈ సదస్సు నిర్వహిస్తోన్న నగరంలో సుమారు 400 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్ అయ్యాయని ఈజిప్టు ఏవియేషన్ అథారిటీతో సన్నిహిత సంబంధాలున్న వర్గాలు ధ్రువీకరించాయి. ‘కాప్ 27కి ముందు ఒక సమావేశం జరిగింది. జెట్స్ రాకను అంచనా వేసిన అధికారులు షర్మ్ ఎల్ షేక్లో తగిన ఏర్పాటు చేశారు’ అని వెల్లడించాయి. ఈజిప్టు పాలకవర్గానికి సన్నిహితుడైన ఒక టాక్ షో హోస్ట్ మాట్లాడుతూ .. 300కు పైగా జెట్స్ వచ్చినట్లు వెల్లడించారు. కాప్ సదస్సు వేళ.. ఈ జెట్స్ వాడకంపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన సమావేశాల సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు కూడా వాటి సంఖ్య వందల్లోనే ఉంది.
ఇదిలా ఉంటే.. కమర్షియల్ విమానాలతో పోలిస్తే, ఈ ప్రైవేట్ జెట్స్ వల్ల వెలువడే ఉద్గారాల మోతాదు చాలా అధికం. యూరోపియన్ క్లీన్ ట్రాన్స్పోర్టు కాంపెయిన్ గ్రూప్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ ఒక గంటలో రెండు టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. కమర్షియల్ విమానాలతో పోలిస్తే.. ఇలా వ్యక్తిగత విమానాల వల్ల ఐదు నుంచి 14 రెట్లు అధిక కాలుష్యం విడుదల అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం.. లండన్ నుంచి షర్మ్ ఎల్ షేక్కు విమానంలో ప్రయాణిస్తే ఒక్కో ప్రయాణికుడికి లెక్కిస్తే.. సగటున హాఫ్ టన్ను CO2 విడుదలవుతుంది.
శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే వరదలు, వడగాలులు, కరవు తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా ఐరాస చీఫ్ గట్టి హెచ్చరిక చేశారు. ‘మానవాళి ముందు రెండు మార్గాలున్నాయి. సహకరించుకోవడం లేక నశించడం’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
ప్రమాదకర టాస్క్లతో యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందనే విమర్శలున్న బ్లూవేల్ ఛాలెంజ్ (Blue Whale Challenge) మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు