QUAD: బైడెన్కు ‘సీలింగ్‘ భయం.. క్వాడ్ దేశాధినేతల సదస్సు రద్దు
అమెరికా (US) ఖజానా మరికొన్ని రోజుల్లో నిండుకోనుంది. అప్పటి వరకు డెట్ సీలింగ్ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా దివాలా తీయాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు బైడెన్ (Joe Biden) సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నారు.
వాషింగ్టన్/కాన్బెర్రా: ఆస్ట్రేలియా వేదికగా వచ్చేవారం జరగబోయే క్వాడ్ సదస్సు రద్దయ్యింది. అగ్రరాజ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిడ్నీ పర్యటనకు రావట్లేదు. దీంతో క్వాడ్ దేశాధినేతల సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.
అమెరికాను డెట్ సీలింగ్ (రుణ గరిష్ఠపరిమితి) సమస్య వెంటాడుతోంది. డెట్ సీలింగ్కు చట్టసభ ఆమోదం లభించకపోతే అగ్రరాజ్యం దివాలా తీసే ప్రమాదముంది. దీంతో ఈ అంశంపై జో బైడెన్ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతంలో మొదలయ్యే తన ఆసియా పర్యటనను బైడెన్ కుదించుకున్నారు. జపాన్లో జరిగే జీ-7 సదస్సుకు హాజరుకానున్న బైడెన్.. ఆ తర్వాత వెళ్లాల్సిన ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాని అల్బనీస్కు.. అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సమాచారమిచ్చారు.
Also Read: అమెరికాను భయపెడుతున్న ‘సీలింగ్’!
ఈ నెల 19-21 తేదీల్లో జపాన్లోని హిరోషిమా వేదికగా జీ-7 సదస్సు జరగనుంది. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు సిడ్నీలో క్వాడ్ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో.. క్వాడ్ సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్ ప్రధాని అల్బనీస్ వెల్లడించారు. ‘‘వచ్చే వారం క్వాడ్ సదస్సు జరగట్లేదు. ఈ వారాంతంలో జరిగే జీ-7 సదస్సులోనే క్వాడ్ (అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్) దేశాధినేతలు భేటీ అవుతారు. అయినప్పటికీ భారత్, జపాన్ ప్రధానులు మోదీ, కిషిదాను మేం మా దేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీని గురించి వారితో చర్చిస్తున్నాం. అయితే తమ పర్యటనపై భారత్, జపాన్ ప్రధానుల నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు’’ అని అల్బనీస్ వెల్లడించారు.
అయితే, తన ఆసీస్ పర్యటనను రద్దు చేసుకున్న బైడెన్.. అల్బనీస్ను అమెరికాకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 22న మోదీకి బైడెన్ శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక, జపాన్లో జరిగే జీ-7 సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఆ సదస్సులో భాగంగా మోదీ, బైడెన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం