Vladimir Putin: రష్యా సైనికుల మాతృమూర్తులతో పుతిన్ సమావేశం
రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం తమ దేశ సైనికుల కుటుంబసభ్యులను కలిశారు. యుద్ధంలో మరణించిన సైనికుల మాతృమూర్తులకు ఆయన ధైర్యం చెప్పారు.
మాస్కో: రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు తీవ్రతరం చేసినవేళ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం తమ దేశ సైనికుల కుటుంబసభ్యులను కలిశారు. యుద్ధంలో మరణించిన సైనికుల మాతృమూర్తులకు ఆయన ధైర్యం చెప్పారు.
‘‘ మీ బాధను అర్థం చేసుకోగలను. కుటుంబసభ్యులు లేని లోటును ఎవరూ తీర్చలేరు. నాతో సహా, రష్యా ప్రభుత్వ నాయకత్వం, ఉన్నతాధికారులు మీ బాధను పంచుకుంటున్నాం. మీ ఆప్తుల మరణాలకు సాధారణంగా సంతాపం తెలిపి దానిని చిన్న విషంగా చూపించే ధైర్యం చేయను. కొడుకులను కోల్పోయి దుఃఖంలో ఉన్న మాతృమూర్తులకు రష్యా ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వయసులో చిన్నా, పెద్ద అనే వ్యత్యాసం లేదు. ఏ వయస్సువారైనా తల్లికి కుమారుడే. మీ కుమారులు దేశం కోసం క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నారు’’ అని పుతిన్ వారితో చెప్పారు. ఆదివారం రష్యాలో మదర్స్డే నిర్వహిస్తున్న నేపథ్యంలో పుతిన్ సైనికులు మాతృమూర్తులకు అభినందనలు తెలిపారు.
సైనికుల కుటుంసభ్యులకు ఆయన కీలక సూచన చేశారు. యుద్ధం గురించి టీవీ, ఇంటర్నెట్లో నకిలీ సమాచారం వ్యాప్తి చెందుతోందని అన్నారు. కాబట్టి, మీరు చదివే, చూసే ప్రతి విషయాన్ని నమ్మవద్దని సైనికుల కుటుంబసభ్యులను ఆయన కోరారు. వాటిలో చూపించే, చెప్పే దానికంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉన్నాయని పుతిన్ వారితో చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్పై యుద్ధానికి ఫిబ్రవరి 27న రష్యా సేనలను పంపిన తర్వాత వారి కుటుంబసభ్యులతో పుతిన్ భేటీ కావడం ఇదే తొలిసారి. యుద్ధం కోసం రష్యా అనుసరిస్తున్న విధానాలపై సైనికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన నేపథ్యంలో వారితో పుతిన్ భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్