Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రిన్స్హ్యారీ (Prince Harry) తన ఆత్మకథలో పేర్కొనడం తాజాగా చర్చనీయాంశమయ్యింది. ఈ విషయాలను వీసా (visa) దరఖాస్తు సమయంలో వెల్లడించారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన మేధోమథన సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ నటి మేఘన్ను (Meghan) వివాహం చేసుకున్న బ్రిటన్ రాజకుటుంబీకుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన వీసా (visa) చెల్లుబాటును సవాలు చేస్తూ అమెరికాకు చెందిన ఓ థింక్ టాంక్ వ్యాజ్యం దాఖలు చేసింది. అమెరికాకు రాకముందు డ్రగ్స్ తీసుకున్నట్లు ఇటీవల విడుదలైన ‘స్పేర్’ (Spare) ఆత్మకథలో ప్రిన్స్హ్యారీ అంగీకరించారని.. అమెరికా అధికారుల ముందు ఆ విషయాలను ప్రిన్స్ హ్యారీ దాచి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. అందుకే ప్రిన్స్ హ్యరీ వీసా దరఖాస్తును బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆ అనుమానాలే నిజమైతే మాత్రం.. ప్రిన్స్ హ్యారీ ఇమ్మిగ్రేషన్ను కోల్పోవడంతోపాటు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే ముప్పు ఎదుర్కోనున్నారు.
అనుమానాలివే..!
ప్రిన్స్ హ్యారీకి వీసా దరఖాస్తును బహిర్గతం చేయాలంటూ అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న ది హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది. గతంలో కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ‘స్పేర్’ ఆత్మకథలో హ్యారీ అంగీకరించారని.. ఇందుకు సంబంధించిన వాస్తవాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వీసా దరఖాస్తును విడుదల చేయాలని.. తద్వారా మాదక ద్రవ్యాలు వినియోగాన్ని వీసా సమయంలో ప్రిన్స్ హ్యారీ వెల్లడించారా..? అనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఫౌండేషన్ డైరెక్టర్ మైక్ హోవెల్ పేర్కొన్నారు.
దీంతోపాటు అమెరికాలో అడుగుపెట్టే ముందు హ్యారీపై నిశిత పరిశీలన జరిగిందా..? అనే విషయంలోనూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకవేళ డ్రగ్స్ విషయం ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసినట్లయితే.. రాజకుటుంబం నుంచి రావడం, ఆయన భార్య సెలబ్రిటీ వంటి అంశాలతో ప్రిన్స్హ్యారీకి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారా..? అని అందులో ప్రశ్నించారు. అదే నిజమైతే మాత్రం.. చట్టవిరుద్ధమేనని అన్నారు.
డిప్లొమాటిక్ వీసాపై..?
హాలీవుడ్ నటి మేఘన్ను వివాహం చేసుకున్న ప్రిన్స్ హ్యారీ.. 2020 మార్చి నెలలో అమెరికా చేరుకున్నారు. అనంతరం కొవిడ్ కారణంగా అక్కడ లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని మాంటెసిటో నివాసంలో ఇద్దరు పిల్లలతో కలిసి హ్యారీ-మేఘన్ దంపతులు నివసిస్తున్నారు. అయితే, విదేశీ రాయబారులు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే ‘డిప్లొమాటిక్ వీసా’పైనే ప్రస్తుతం ప్రిన్స్ హ్యారీ అమెరికాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు.
అమెరికాకు రాకపోకలు కష్టమే..
ఇదిలాఉంటే, సాధారణంగా అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారిని నేర చరిత్ర, డ్రగ్స్ వినియోగం వంటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి అవాస్తవాలు వెల్లడిస్తే మాత్రం అక్కడి చట్టాల ప్రకారం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేశం నుంచి బహిష్కరణతో పాటు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడం కూడా వీలుకాదు. ఇలా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన విషయంలో ఎంతో మంది బ్రిటన్ దేశస్థులు అమెరికా నుంచి నిషేధానికి గురయ్యారు. ఒకవేళ తాజాగా వేసిన వ్యాజ్యంలో ప్రిన్స్హ్యారీ విఫలమైతే.. అమెరికాకు రాకపోకలు సాగించడం కష్టమే అవుతుంది. బ్రిటన్ రాజకుటుంబాన్ని ఎదురించి బయటకు వచ్చిన హ్యారీ తాజాగా మరో సవాలును ఎదుర్కోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు