Priyanka Chopra: రండి.. ప్రపంచాన్ని మార్చుకుందాం: ఐరాస వేదికపై ప్రియాంక చోప్రా పిలుపు
సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయమైన ప్రపంచంలో జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్
యునైటెడ్ నేషన్స్: సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయమైన ప్రపంచంలో జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ అన్నారు. పరస్పర సహకారంతోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. యునిసెఫ్ సహృద్భావ రాయబారిగా ఉన్న ప్రియాంక.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయ సంఘీభావం అత్యంత ముఖ్యమైనదని ఆమె అన్నారు.
‘‘ప్రపంచం పరిస్థితులు అంతగా బాగోలేవు. కొవిడ్ మహమ్మారి వినాశకర ప్రభావం నుంచి బయటపడేందుకు దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. పర్యావరణ సంక్షోభం జీవితాలను, జీవనోపాధిని దెబ్బకొడుతూనే ఉంది. ఘర్షణలు, పేదరికం, ఆకలి, అసమానతలు.. మనం సుదీర్ఘకాలంగా పాటుపడుతోన్న న్యాయపూరిత సమాజపు పునాదులను నాశనం చేస్తున్నాయి. ఈ సంక్షోభాలు యాదృచ్ఛికంగా సంభవించలేదు. కానీ, వీటిని మనం పరిష్కరించుకోవచ్చు. అదే ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రణాళిక. 2015లో ఈ ప్రణాళికను మనమే రూపొందించుకుని 15ఏళ్లకు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కాలం పరిగెడుతోంది. ఇప్పటికే మన లక్ష్యానికి పెట్టుకున్న గడువులో సగం సమయం గడిచిపోయింది. మిగిలిన ఎనిమిదేళ్లలోనైనా ఈ లక్ష్యాలను సాధించుకోవాలి. మన ప్రపంచాన్ని మార్చుకునే అద్భుత అవకాశం మనకు ఉంది. ఈ భూగ్రహానికి మనమెంతో రుణపడి ఉన్నాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయపరమైన ప్రపంచంలో జీవించే హక్కు మనందరికీ ఉంది. అందుకు కార్యాచరణ అవసరం. ఎందుకంటే అది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి నమ్మకం. మనమంతా కలిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మన ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది’’ అని ప్రియాంక పిలుపునిచ్చారు.
పేదరికం నిర్మూలించి ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు ఈ భూమండలాన్ని రక్షించుకునేందుకు చేపట్టిన విశ్వ కార్యాచరణే.. ఈ సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల ప్రణాళిక. 2015లో ఐరాస సభ్య దేశాలు 17 లక్ష్యాలతో ఈ ప్రణాళికను రూపొందించాయి. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మలాలాతో ప్రియాంక ఫొటో..
ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన చిత్రాలను ప్రియాంక తన సోషల్మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్, సామాజిక కార్యకర్త అమండా గోర్మన్ తదితరులతో దిగిన ఫొటోలను కూడా నటి షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు