USA: గ్యాస్ పైపులైన్ను ఉక్రెయిన్ మద్దతుదారులే పేల్చివేసి ఉండొచ్చు: అమెరికా
నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్ పేల్చివేతపై అమెరికా సరికొత్త ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఉక్రెయిన్(Ukraine) గ్రూపులే ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: జర్మనీ సహా ఇతర ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా చేసే నార్డ్స్ట్రీమ్ పైపులైన్ పేల్చివేతపై అమెరికా(USA) సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉక్రెయిన్(Ukraine) అనుకూల గ్రూపు ఈ పనిచేసి ఉండొచ్చని పేర్కొంది. అమెరికా దర్యాప్తు బృందాలు సంపాదించిన సరికొత్త ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ దాడిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేదా ఆయన సహాయకుల హస్తం లేదని వెల్లడించింది.
రష్యా నుంచి పశ్చిమ ఐరోపాలోని దేశాలను అనుసంధానిస్తూ నిర్మించిన నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్పై దాడి జరిగింది. దీనికి ఏ దేశం బాధ్యత తీసుకోలేదు. ఉక్రెయిన్ గత కొన్నేళ్లుగా ఈ గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కీవ్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వెల్లడైనా.. ఆ తర్వాత ప్రభుత్వం, సైన్యం తమకు సంబంధం లేదని వెల్లడించాయి. ఆ తర్వాత ఏకంగా అమెరికా ప్రత్యేక దళాలే ఈ గ్యాస్ పైపులైన్ను పేల్చివేశాయని.. తద్వార ఐరోపా రష్యాపై ఆధారపడే పరిస్థితి నుంచి దూరం చేసిందని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు సిమౌర్ హెర్ష్ కొన్నళ్ల కిందట ఓ కథనం విడుదల చేశారు. దీనిని అప్పట్లో అమెరికా ఖండించింది.
తాజాగా అమెరికా సరికొత్త ఇంటెలిజెన్స్ రిపోర్టులో పుతిన్ వ్యతిరేకులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. కానీ, వారెవరనే విషయాన్ని పేర్కొనలేదు. తమ వద్ద ఉన్నది ఎటువంటి ఇంటెలిజెన్స్ సమాచారమో వివరించేందుకు అమెరికా నిరాకరించింది. ఉక్రెయిన్తో సంబంధం ఉన్న పరోక్ష దళాలు దీనిలో పాల్గొన్నాయని మాత్రం వెల్లడిస్తోంది.
వాస్తవానికి ఈ గ్యాస్ పైపులైన్పై దాడి జరిగిన సమయంలో తొలుత రష్యానే ఈ పనిచేసి ఉంటుందని అమెరికా సహా పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కానీ, తాజాగా రష్యా ప్రభుత్వానికి ఈ దాడితో సంబంధం ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికా లేదా బ్రిటన్ జాతీయులకు ఈ దాడితో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
మాకు సంబంధం లేదు: ఉక్రెయిన్
నార్డ్స్ట్రీమ్ పైపులైన్ పేల్చివేతలో తమ అనుకూల గ్రూపు హస్తం ఉందని అమెరికా మీడియాలో విడుదలైన నివేదకలపై ఉక్రెయిన్ స్పందించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు దీనిపై స్పందిస్తూ ‘‘మా ప్రభుత్వంపై వచ్చే కుట్రకోణాలను తెలుసుకొవడాన్ని ఎంజాయ్ చేస్తాను. కానీ, ఒక్కమాట చెబుతున్నాను. బాల్టిక్ సముద్రంలో జరిగిన ప్రమాదంతో మాకు ఎటువంటి సంబంధ లేదు. అంతేకాదు.. వారు చెబుతున్న ఉక్రెయిన్ అనుకూల గ్రూపు ఏదో కూడా నాకు తెలియదు’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య