Ukraine Crisis: పౌరుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం: ఐరాస చీఫ్
ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రకటించిన రష్యా.. ఆ దేశంపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ పోరులో ఇప్పటివరకు 137 మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులూ ఉన్నారని తెలిపారు...
న్యూయార్క్: ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రకటించిన రష్యా.. ఆ దేశంపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ పోరులో ఇప్పటివరకు 137 మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులూ ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ యుద్ధ పరిస్థితులపై శుక్రవారం మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ‘పెరుగుతోన్న మరణాలతో.. ఉక్రెయిన్లోని ప్రతి మూలలో బాధాకర, భయాందోళనల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో పౌరుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. మానవతా సాయంతోపాటు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు మద్దతుగా నిలవాలి’ అని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
అదే విధంగా.. ఉక్రెయిన్తోపాటు పరిసర ప్రాంతాల్లో ఐరాస తరఫున సహాయ కార్యకలాపాలను పెంచుతోన్నట్లు చెప్పారు. ‘ఉక్రెయిన్లోని ప్రజలకు అవసరమైన సమయంలో మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఎవరు, ఎక్కడ ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా.. వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. గురువారం పుతిన్ మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన సమయంలోనూ.. దాన్ని నిలిపేయాలంటూ గుటెరస్ కోరిన విషయం తెలిసిందే. మానవత్వంతో.. మీ దళాలను రష్యాకు తిరిగి రప్పించాలని ఆ దేశాధ్యక్షుడు పుతిన్కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రష్యాకు చెందిన విధ్వంసక బృందాలు రాజధాని నగరం కీవ్కు అతి సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నగరం వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.