Putin: రూ.990కోట్ల ఎస్టేట్లో.. ప్రేయసితో రహస్యంగా పుతిన్ జీవనం..!
రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ గురించి ఆసక్తికర కథనాలు రావడం కొత్తేం కాదు. తాజాగా ఆయన రహస్య జీవనం, ప్రేయసి గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.
మాస్కో: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) సైనిక చర్య ప్రారంభమైన దగ్గరి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురించి కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన తన ప్రేయసి అలీనా కబయేవాతో కలిసి 120 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 990 కోట్లు) విలువైన ఎస్టేట్లో రహస్యంగా నివసిస్తున్నట్లు ఓ వార్తా కథనం వెల్లడించింది. ఇది మాస్కోకు 400కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఎస్టేట్లో అనేక భవనాలు ఉన్నాయని, వారి ముగ్గురు పిల్లల కోసం ఓ ప్లేగ్రౌండ్ కూడా ఉందని తెలిపింది. రష్యన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ సైట్ ది ప్రాజెక్ట్ ఈ కథనాన్ని వెలువరించింది.
జిమ్నాస్ట్, ఒలిపింక్స్ గోల్డ్మెడలిస్ట్ అయిన అలీనా కబయేవా.. పుతిన్ గర్ల్ఫ్రెండ్ అంటూ సుదీర్ఘకాలంగా వార్తలు వస్తున్నాయి. వారికి ముగ్గురు పిల్లలని చెప్తారు. ఇక ఈ ఎస్టేట్ వాల్దాయ్ సరస్సుకు దగ్గర్లో ఉంది. సైప్రస్ నుంచి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగించి ఈ విలాస భవనాన్ని కొనుగోలు చేశారట. 13 వేల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించారని, ఈ భవనంలో బంగారాన్ని కూడా ఉపయోగించినట్లు కొన్ని చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ నిధుల నుంచి అలీనాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. అలీనా గ్రాండ్ మదర్కు కూడా సొంత ఆస్తులు ఉన్నాయట. మాస్కోకు దగ్గర్లో మూడు అంతస్తుల భవనం ఉందని తెలిపింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ బృందం మొదట ఈ ఎస్టేట్ గురించి వెల్లడించింది. బడ్జెట్ నిధులను దీనికి వెచ్చించారని ఆరోపించింది.
పుతిన్(Putin) అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనా.. యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగానూ వ్యవహరించారు. నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డు ఛైర్పర్సన్గా పనిచేశారు. ఈ కంపెనీకి రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజార్టీ వాటాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్