Putin: అదే జరిగితే.. కొత్త ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాం: పుతిన్ హెచ్చరిక
పశ్చిమ దేశాలు ఒకవేళ ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేస్తే.. ఇక్కడి మరిన్ని కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా హెచ్చరించారు. సంఘర్షణను పొడిగించడమే లక్ష్యంగా కొత్త ఆయుధాల తరలింపులు...
మాస్కో: పశ్చిమ దేశాలు ఒకవేళ ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేస్తే.. ఇక్కడి మరిన్ని కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా హెచ్చరించారు. సంఘర్షణను పొడిగించడమే లక్ష్యంగా కొత్త ఆయుధాల తరలింపులు ఉన్నాయని ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పుతిన్ ఈ మేరకు మాట్లాడినట్లు రష్యా వార్తా ఏజెన్సీలు ఆదివారం పేర్కొన్నాయి. ‘ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేస్తే.. మేం తగిన విధంగా స్పందిస్తాం. కొత్త లక్ష్యాలను మా ఆయుధాలతో ధ్వంసం చేస్తాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే, ఏ లక్ష్యాలపై దాడులు చేస్తారు? ఏ శ్రేణి క్షిపణులను వినియోగిస్తారు? తదితర వివరాలు పేర్కొనలేదు. ఉక్రెయిన్కు రాకెట్ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే పుతిన్ ఈ మేరకు స్పందించారు.
మాస్కో దాడులను తిప్పికొట్టడంలో ఉక్రెయిన్కు బాసటగా బ్రిటన్, జర్మనీ, స్వీడన్ తదితర దేశాలు ముందుకొస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా సైతం హైటెక్, మధ్య శ్రేణి రాకెట్ వ్యవస్థలను పంపేందుకు ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా హిమార్స్ మల్టీపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ను సరఫరా చేయనుంది! దీని ద్వారా దాదాపు 80 కి.మీల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించవచ్చు. ఈ రాకెట్ సిస్టమ్స్ పరిధి.. రష్యన్ వ్యవస్థల కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దీనిద్వారా కీవ్ దళాలు మాస్కోకు చిక్కకుండా వారి సేనలపై దాడి చేయొచ్చని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పుతిన్ కొట్టిపారేస్తూ.. క్షిపణుల పరిధి అనేది ప్రయోగించే వ్యవస్థపై ఆధారపడి ఉండదని, క్షిపణులపై ఆధారపడి ఉంటుందన్నారు. పైగా, ఉక్రెయిన్కు వాషింగ్టన్ సరఫరా చేసిన ఆయుధాల్లో కొత్తవి ఏవీ లేవని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ