Putin: పుతిన్ అణు బెదిరింపుల మర్మం ఏమిటీ..!
ఐరోపా ఖండంపై అణుముప్పు ముసిరింది. అమెరికా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు నుంచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల జపం చేస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ దాడిపై అనుమానాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఐరోపా ఖండంపై అణుముప్పు ముసిరింది. అమెరికా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు నుంచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల జపం చేస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రాన్ ముఖం మీదే వీటి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ, అప్పట్లో రష్యా విజయం నల్లేరుపై నడక వంటిదే అనుకొని అణ్వాయుధ ప్రయోగాన్ని అందరూ తేలిగ్గా తీసుకొన్నారు. కానీ, ఆరు నెలలు పూర్తైనా రష్యాకు విజయం దక్కలేదు. నాటో సహకారంతో ఉక్రెయిన్ సేనలు ఇప్పుడు ఎదురుదాడులు మొదలుపెట్టాయి. మరోవైపు మాస్కో ఆర్థిక, ఆయుధ పరిస్థితి దిగజారడంతో పాటు మిత్రదేశాల నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగిపోయాయి. ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయని పుతిన్ గ్రహించారు. గత వారం సైనిక దళాలను సమీకరిస్తామని చెబుతూనే పశ్చిమదేశాలు అణుబెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయనీ.. వాటిని రష్యా రక్షణకు నిస్సంకోచంగా వాడతామని పేర్కొన్నారు. దీంతో ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో విలీనం చేసే రెఫరెండం ప్రక్రియ మొదలుపెట్టారు. అది నేటితో పూర్తవుతుంది. అది పూర్తయితే ఆ భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ చేసే దాడి.. రష్యా సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణిస్తారు. అప్పుడు అణ్వాయుధాలు వాడే అవకాశం ఉంటుందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి.
ఎలాంటి అణ్వాయుధాలంటే..
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ లెక్కల ప్రకారం రష్యా వద్ద మొత్తం 4,477 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,900లు ‘నాన్-స్ట్రాటజిక్’ వర్గానికి చెందినవి. వీటినే టాక్టికల్ అణ్వాయుధాలు అంటారు. సాధారణ అణ్వాయుధాలకు, వీటికి మధ్య కొంత తేడా ఉంది. వీటిని పరిమితమైన యుద్ధ క్షేత్రంలో వాడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే భూమిపై యుద్ధ ట్యాంకుల సమూహం, సముద్రంలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు. వీటికి 10 కిలో టన్నుల శక్తి నుంచి 100 కిలో టన్నుల డైనమెట్లు పేల్చినంత శక్తి ఉంటుంది. ఇవి చిన్నవని చెబుతుంటారు.. వాస్తవానికి జపాన్పై అమెరికా ప్రయోగించిన బాంబులకు శక్తి కేవలం 15 కిలో టన్నుల నుంచి 21 కిలో టన్నులు మాత్రమే. అమెరికా ప్రభుత్వ ఆర్కైవ్స్ ప్రకారం ఈ బాంబులు పేలిన వెంటనే అత్యధికంగా 70 వేల మంది ప్రాణాలను హరించాయి. అంటే వీటికంటే రష్యా టాక్టికల్ అణుబాంబుల శక్తి చాలా ఎక్కువన్నమాట. ఇక రష్యా వద్ద ఉన్న స్ట్రాటజిక్ శ్రేణి వార్ హెడ్లకు 500 కిలో టన్నుల నుంచి 800 కిలోటన్నుల శక్తి ఉంటుంది. వీటితో పట్టణాలనే ధ్వంసం చేయవచ్చు.
లక్ష్యమే కీలకం..
అణ్వాయుధ ముప్పును కేవలం బాంబుల శక్తితోనే చూడకూడదు. వాటిని ప్రయోగించే లక్ష్యాల ఆధారంగా చూడాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నైతిక స్థైర్యం దెబ్బతీయడం, భయోత్పాతాలు సృష్టించడమే లక్ష్యంగా హిరోషిమా, నాగసాకి వంటి జనావాసాలపై అమెరికా 15 కిలోటన్నుల శక్తి ఉన్న అణుబాంబులు వేసింది. అవి సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందే. వాస్తవానికి టాక్టికల్ అణు బాంబులంటూ ఏమీ ఉండవని అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్ మాటీస్ వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వీటిని వాడతారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ విద్యుత్తు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేలా భారీగా ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలను సృష్టించేలా అణ్వాయుధాన్ని వాడే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. భారీగా మరణాలు ఉండకుండా చూసేందుకు ఉక్రెయిన్ నీటిపై గానీ, లేదా ఆకాశంలో నిర్ణీత ఎత్తులో కూడా అణు పేలుడుకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేస్తే.. ఆ పేలుడు నుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ పల్స్ ఉక్రెయిన్ పరికరాలను ధ్వంసం చేస్తాయి. ‘ప్రాజెక్టు కె నూక్లియర్ పరీక్ష’ పేరిట 1962లో సోవియట్ ప్రభుత్వం కజకిస్థాన్ గగనతలంపై ఈ ఆయుధాలను విజయవంతంగా పరీక్షించింది.
రష్యా వాడితే పరిస్థితి ఏమిటీ..
భారీ ఓటమిని తప్పించుకోవడానికి ముందుగానే చిన్న అణ్వాయుధాలను వాడేలా నాయకులు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అదే పెద్ద అణ్వాయుధాలు వాడితే ప్రత్యర్థుల నుంచి ప్రతిదాడికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గత వారం పుతిన్ హెచ్చరికలపై ‘ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ నూక్లియర్ వెపన్స్’ (ఐసీఏఎన్) అంచనా ప్రకారం ఐరోపాలో అణుపేలుడు.. జపాన్పై అణుదాడి కంటే తీవ్ర పరిణమాలను సృష్టిస్తుంది. వేల మంది పౌరుల ప్రాణాలను ఇది బలికొంటుందని ఆ సంస్థ అంచనావేసింది. పలు దేశాలు రేడియేషన్ ప్రభావం కిందకు వస్తాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!