FIFA World Cup 2022: స్టేడియాల నిర్మాణ సమయంలో బలైన కార్మికుల సంఖ్య 500!
ఫిఫా ప్రపంచ కప్ 2022 క్రీడలు ఖతార్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే, ఈ అత్యాధునిక స్టేడియాల నిర్మాణ సమయంలో సుమారు 400 నుంచి 500 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఖతార్ అధికారి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దోహా: ఖతార్లో జరుగుతోన్న ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల కోసం దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రత్యేక స్టేడియాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, వీటి నిర్మాణం క్రమంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య సుమారు 400 నుంచి 500 మధ్య ఉండవచ్చని ప్రపంచ కప్ నిర్వహణతో సంబంధమున్న ఓ ఖతార్ ఉన్నతాధికారి వెల్లడించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. తాజాగా సదరు అధికారి వెల్లడించిన మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఖతార్ స్టేడియాల నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు, క్రీడల నిర్వహణకు సంబంధించి ఖతార్ సుప్రీం కమిటీ సెక్రటరీ జనరల్ హసన్ అల్-థవాడీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. స్టేడియాల నిర్మాణ క్రమంలో ఎంత మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. కచ్చితమైన సంఖ్య లేనప్పటికీ సుమారు 400 నుంచి 500 వరకు ఉండవచ్చని సమాధానమిచ్చారు. ఇప్పటివరకు ఖతార్ అధికారులు వెల్లడించిన గణాంకాల కంటే ఇది చాలా ఎక్కువ.
ఖతార్కు ఫిఫా ప్రపంచ కప్-2022 నిర్వహణ 2010లో ఖరారయ్యింది. ఇందుకోసం 2014 నుంచి 2021 వరకు స్టేడియాలు, వేదికలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలను చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 40 మంది కార్మికులు మాత్రమే చనిపోయినట్లు వెల్లడించింది. అందులో 37మంది ఖతార్కు చెందినవారేనని తెలిపింది. పని ఒత్తిడి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మౌలిక వసతుల లేమి వంటి కారణాలతో చాలా మంది కార్మికులు మరణించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఖతార్.. వలస కార్మికుల వేతనాలు, కఫాలా వ్యవస్థ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అరబ్ దేశాల్లో పనిచేసే కార్మికుల్లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకు చెందినవారే అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు