Antibodies: టీకా తీసుకున్న 6 నెలల తర్వాత కూడా రక్షణే..!
వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా కొవిడ్-19కు కారణమయ్యే వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
నాణ్యమైన యాంటీబాడీలు దోహదం చేస్తున్నాయన్న తాజా అధ్యయనం
వాషింగ్టన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు కొన్ని నెలలకే క్షీణిస్తాయనే వార్తలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా కొవిడ్-19కు కారణమయ్యే వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. వాటి నాణ్యత వల్ల కొవిడ్ను ఎదుర్కొనే సామర్థ్యం అలాగే కొనసాగుతోందని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ల పనితీరును తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ వాస్తవ ఫలితాలను విశ్లేషించారు. వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీల స్థాయి క్షీణిస్తున్నప్పటికీ రోగనిరోధక ప్రతిస్పందనలు మాత్రం స్థిరంగా ఉంటున్నట్లు గమనించారు. అంతేకాకుండా వైరస్ ఎటువంటి మార్పులకు గురికానంత వరకు ఈ తక్కువ యాంటీబాడీలు కూడా ఆశించిన మేరకు రక్షణ కల్పిస్తున్నట్లు గుర్తించారు. ఇలా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత కూడా చాలా మందిలో యాంటీబాడీలు మెరుగుగా ఉంటాయనే విషయం ఊహించలేదని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనకర్త అలీ ఎల్లెబెడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలు, లింఫోనోడ్లతో పాటు ఎముక మజ్జను కూడా తీసుకొని పరీక్షించారు. వాటిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసే బీ కణాలు కొన్ని నెలలపాటు ఉంటున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్న మొదట్లో కంటే 6 నెలల తర్వాతే మెరుగైన యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు ఉండడం ఒక్కటే ముఖ్యం కాదని.. వాటి సంఖ్య తగ్గినప్పటికీ అవి ఎంతో రోగనిరోధకత కలిగి ఉన్నాయని చెప్పారు. ప్రమాదకరమైన కొత్త వేరియంట్ వస్తే తప్ప వీటితో పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. వీటికి సంబంధించిన తాజా నివేదిక జర్నల్ నేచర్లో ప్రచురితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM